మానవుడు తన మనస్సులో మెదిలే మనోభావాల తోనే పుణ్యపాపాలు లెక్కిస్తాడు. . అసలు పుణ్యపా పాల గరించి భావన లేని వాడికి ఆ పుణ్యపాపాల ప్రసక్తే ఉండదు. సదా శ్రద్ధతో పరమాత్మను భావన చేసేవారి కి నివృతి మార్గం ముక్తికి దారిచూపు తుంది అని శాస్త్రం చెబుతోంది.
మనం విరామకాలం అంతా భగవచ్చింతనలో గడపటానికి అలవాటు పడాలి. దానికి ఎన్నో మార్గాలు శాస్త్రం సూచించింది.నామ జపం, సత్సంగం,సత్కధా శ్రవణం, ధ్యానం, పూజాదికాలలో నిమగ్నమై ఎప్పుడూ భగవచ్చింతనలోనే గడపటానికి ఏదో ఒకమార్గాన్ని అన్వేషించాలి. పాపాచరణ జ్ఞానేంద్రియాలతో కానీ, కర్మేంద్రియాలతో కానీ జరగకుండా జాగ్రత్తపడాలి.దుష్టచింతనలు లేక స్వచ్చమైన మనస్సుతో, పవిత్రమైన హృదయంతో జీవించి తుదకు ముక్తి పొందడానికి భక్తియే మార్గం. మనస్సు భక్తితో నిండిపోతే ఆ నిర్మల హృదయంలో భగవంతుడు నివసించడానికి అవకాశముంటుంది.మనం ఎప్పుడూ సత్యాన్వేషణ, ముక్తి మార్గంలో ఉండడమే ఈ దేశ విశిష్ఠత. ముక్తే పరమోన్నత లక్ష్యం.
న్యాయంగా ధర్మంగా సంపాదించిన ధనంతో దైవకార్యాలు, సమాజశ్రేయస్సుకు పనికివచ్చే కార్యాలు నా పరంగా నా కోసం చెయ్యి. ఒక్కమాటలోచెప్పాలంటే నిష్కామ కర్మ, ఇతరులకు ఉపయోగపడే కర్మలు, పరమాత్మపరంగా చెయ్యాలి. ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి, తరువాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి , అదే ముక్తికి మార్గం.
ముక్తి మార్గంలో ఎలాంటి ఆచారాలు లేవు. ఆచారాలు లౌకిక జీవితంలో మాత్రమే ఉంటాయి. ఇది భౌతిక మరియు భౌతిక సుఖాలను కోరుకునే వారి కోసం. కర్మలు చేయడం ద్వారా, మనం సాపేక్ష ప్రాపంచిక ఆనందాన్ని భౌతిక ప్రపంచంలోని సుఖాలను పొందుతారు. అయితే, మనం ఈ తాత్కాలిక ప్రాపంచిక ఆనందాన్ని కోరుకోకుండా, శాశ్వతమైన ఆనందం కోసం ఆరాటపడినట్లయితే , మోక్షమార్గం సుళువుగా తెరుచుకుంటుంది.
కాబట్టి ఈ జన్మలోన్వ్ తక్షణం ఒక సద్గురువును ఆశ్రయించి సాధన చేసి సదాచారాలుగా జీవించి ఉత్తమ కర్మలను ఆచరించి, సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను నిర్మూలించుకొని కర్మరాహిత్యాన్ని పొంది ఈ జన్మలోనే మరొక జన్మలేని జన్మరాహిత్యాన్ని పొంది ఆ భగవంతుడిలో ఐక్యమై ముక్తిని, మోక్షాన్ని పొందుతూ, ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవడానికి తక్షణమే మనం నడుం బిగించాలి.
మనం విరామకాలం అంతా భగవచ్చింతనలో గడపటానికి అలవాటు పడాలి. దానికి ఎన్నో మార్గాలు శాస్త్రం సూచించింది.నామ జపం, సత్సంగం,సత్కధా శ్రవణం, ధ్యానం, పూజాదికాలలో నిమగ్నమై ఎప్పుడూ భగవచ్చింతనలోనే గడపటానికి ఏదో ఒకమార్గాన్ని అన్వేషించాలి. పాపాచరణ జ్ఞానేంద్రియాలతో కానీ, కర్మేంద్రియాలతో కానీ జరగకుండా జాగ్రత్తపడాలి.దుష్టచింతనలు లేక స్వచ్చమైన మనస్సుతో, పవిత్రమైన హృదయంతో జీవించి తుదకు ముక్తి పొందడానికి భక్తియే మార్గం. మనస్సు భక్తితో నిండిపోతే ఆ నిర్మల హృదయంలో భగవంతుడు నివసించడానికి అవకాశముంటుంది.మనం ఎప్పుడూ సత్యాన్వేషణ, ముక్తి మార్గంలో ఉండడమే ఈ దేశ విశిష్ఠత. ముక్తే పరమోన్నత లక్ష్యం.
న్యాయంగా ధర్మంగా సంపాదించిన ధనంతో దైవకార్యాలు, సమాజశ్రేయస్సుకు పనికివచ్చే కార్యాలు నా పరంగా నా కోసం చెయ్యి. ఒక్కమాటలోచెప్పాలంటే నిష్కామ కర్మ, ఇతరులకు ఉపయోగపడే కర్మలు, పరమాత్మపరంగా చెయ్యాలి. ఆ ఫలితాలను పరమాత్మకు అర్పించి, తరువాత వాటిని భగవంతుని ప్రసాదంగా స్వీకరించాలి , అదే ముక్తికి మార్గం.
ముక్తి మార్గంలో ఎలాంటి ఆచారాలు లేవు. ఆచారాలు లౌకిక జీవితంలో మాత్రమే ఉంటాయి. ఇది భౌతిక మరియు భౌతిక సుఖాలను కోరుకునే వారి కోసం. కర్మలు చేయడం ద్వారా, మనం సాపేక్ష ప్రాపంచిక ఆనందాన్ని భౌతిక ప్రపంచంలోని సుఖాలను పొందుతారు. అయితే, మనం ఈ తాత్కాలిక ప్రాపంచిక ఆనందాన్ని కోరుకోకుండా, శాశ్వతమైన ఆనందం కోసం ఆరాటపడినట్లయితే , మోక్షమార్గం సుళువుగా తెరుచుకుంటుంది.
కాబట్టి ఈ జన్మలోన్వ్ తక్షణం ఒక సద్గురువును ఆశ్రయించి సాధన చేసి సదాచారాలుగా జీవించి ఉత్తమ కర్మలను ఆచరించి, సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను నిర్మూలించుకొని కర్మరాహిత్యాన్ని పొంది ఈ జన్మలోనే మరొక జన్మలేని జన్మరాహిత్యాన్ని పొంది ఆ భగవంతుడిలో ఐక్యమై ముక్తిని, మోక్షాన్ని పొందుతూ, ఆ భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొవడానికి తక్షణమే మనం నడుం బిగించాలి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి