మూర్ఖులతో వాదన తగదు ;- - యామిజాల జగదీశ్
 అనగనగా ఒక రోజు గాడిద పులితో  చెప్పింది  "గడ్డి నీలంగా ఉంది" అని.
కానీ పులి "నువ్వు చెప్పింది సరికాదు. గడ్డి పచ్చగానే ఉంది...ఉంటుంది" అంది.
 వాటి మధ్య వాదన వేడెక్కింది. రెండూ ఎవరిది సరైనదో తేల్చుకోవడం కోసం మృగరాజు సింహం వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. అవి వెళ్ళే సమయానికి సింహం ఎప్పట్లాగే గంభీరంగా కూర్చుని ఉంది. 
"ఏమిటీ పొద్దున్నే వచ్చారిద్దరూ? ఏమైంది?" అని అడిగింది సింహం.
అప్పుడు గాడిద మొదలు పెట్టింది చర్చను.
"రాజా! నువ్వే మా తగవు తీర్చాలి. గడ్డి వంగు నీలమేగా" అని అడవంతా వినిపించేలా కర్ణకఠోరంగా అరిచింది. 
సింహం "అందులో అనుమానమేముం ది...నువ్వు చెప్పిందే నిజం... గడ్డి నీలంగానే ఉంటుంది." అంది.
అయితే గాడిద "నువ్వు నా మాటతో ఏకీభవిస్తున్నావు. కానీ ఈ పులి నాతో ఏకీభవించలేదు. పైగా నాకు విరుద్ధంగా ఉంది. అది నా మనసుని నొప్పించింది. గడ్డి పచ్చ రంగు అని చెప్తోంది. నువ్వే దానిని  శిక్షించాలి." అంది
అప్పుడు మృగరాజు "పులి అయిదేళ్ళపాటు మౌనంగా ఉండాలి" అంటూ శిక్ష విధించింది.
మృగరాజు మాటతో గాడిద ఆనందానికి పట్టపగ్గాల్లేవు. ఉల్లాసంగా దూకుతూ తన దారిన పోయింది.
అప్పటి వరకు మౌనంగా ఉన్న పులి
 సింహాన్ని అడిగింది...
 "రాజా, నన్నెంందుకు శిక్షించారు? గడ్డి పచ్చగానే కదా ఉంటుంది." అని.
అంతట సింహం చెప్పింది "ఔను. నువ్వు చెప్పింది ముమ్మాటికీ నిజం. గడ్డి ఆకుపచ్చగానే ఉంటుంది...అందులో అణువంత అబద్ధం లేదు" అని.
 పులి "అయితే నన్నెంందుకు శిక్షింంచావు?"
అని అడిగింది.
సింహం “గడ్డి నీలమా, పచ్చనా అనే ప్రశ్నకు సంబంధం లేదు.. గాడిదతో వాదిస్తూ కాలాన్ని వృధా చేయడం నీలాంటి ధైర్యవంతుడికి తెలివిగల ప్రాణికి అనవసరం. ఆ క్షణాన ఈ తగవుకి తెర దిఉచడం కోసం నిన్ను శిక్షిస్తూ తీర్పు చెప్పాను. అంతకన్నా మరొకటి కాదు" అంది. 
నిజం లేదా వాస్తవికత గురించి పట్టించుకోని మూర్ఖులతో వాదించడంవల్ల మనం అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకుంటాం. మూర్ఖుల విజయం విజయం కానే కాదు. వారు సాధించామనుకున్న విజయం ఊహలకే పరిమితం. వారి నమ్మకాలు అర్థంపర్థం లేనివి.  అటువంటి అర్థం లేని వాదనలకు సమయాన్ని వెచ్చించడం వృధా.... మనం ఎన్ని సాక్ష్యాలు సమర్పించినా అర్థం చేసుకోలేని వ్యక్తులు మనకు తారసపడుతూనే ఉంటారు. 
మరికొందరికి అహం, ద్వేషం, పగతో కళ్ళుమూసుకుపోతాయి.  అజ్ఞానం అరుస్తున్నప్పుడు, తెలివితేటలనే జ్ఞానం మౌనంగా ఉంటుంది. అటువంటి సమయాలలో మీ శాంతి,  నిశ్శబ్దం మరెంతో  విలువైనవి అని గ్రహించాలి.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం