ప్రపంచ శరణార్థుల దినోత్సవం ప్రతి ఏట జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ప్రపంచంలోని శరణార్థుల గురించి అవగాహన కలిపించడంకోసం ఈ దినోత్సవంను జరుపుతున్నారు.శరణార్థులు అంటే జాతి, మతం, జాతీయత, సామాజిక సమూహంలో సభ్యత్వం లేదా రాజకీయ అభిప్రాయం వంటి అంశాల ఆధారంగా వేధింపులకు గురవుతారనే భయంతో తమ స్వదేశాలకు పారిపోయిన వ్యక్తులు. శరణార్థులు తమ జీవితాలను నిర్మించుకోవడం పట్ల అవగాహన మరియు సహానుభూతిని పెంపొందించడం ఈ రోజు లక్ష్యం గా నిర్ణయించబడింది.1951 రెఫ్యూజీ కన్వెన్షన్ 50వ వార్షికోత్సవం సందర్భంగా జూన్ 20, 2001న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని మొదటిసారి జరుపుకున్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం జూన్ 20 ను అధికారికంగా డిసెంబర్ 2000 లో ప్రపంచ శరణార్థుల దినోత్సవంగా నియమించింది.ఈ ముఖ్యమైన రోజు సంఘర్షణ, హింస లేదా భీభత్సం కారణంగా తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోవాల్సిన లక్షలాది మంది వ్యక్తుల బలం, ధైర్యం మరియు స్థితిస్థాపకతను గౌరవించే వేదికగా ఉపయోగపడుతుంది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం శరణార్థుల కష్టాలపై వెలుగునిస్తుంది.ఐర్లాండ్లో 1845-1855లో బంగాళాదుంప కరువు సమయంలో 1.5 మిలియన్లకు పైగా ఐరిష్ పెద్దలు మరియు పిల్లలు సామూహికంగా వలసవెళ్లడం, 15వ శతాబ్దంలో స్పెయిన్ నుండి యూదులను బహిష్కరించడం మరియు 1685లో ఫ్రాన్స్ నుండి హ్యూగెనాట్ ఎక్సోడస్ వంటివి కొన్ని ఉదాహరణలు. . ఈ నిర్వాసితుల దుస్థితిని ఎత్తిచూపేందుకు జూన్ 20న ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.ఉక్రెయిన్పై రష్యా దురాక్రణ కోట్లాది మంది జీవితాలను తారుమారు చేసింది. యుద్ధం ప్రారంభమైన తర్వాతి నుంచి ఇప్పటి వరకు 1.10 కోట్ల మంది ఉక్రెయిన్ను వీడారు.సంక్షోభాలు, మానవ హక్కుల ఉల్లంఘన, హింస కారణంగా ప్రపంచవ్యాప్తంగా దాదా పు 11 కోట్ల మంది సొంత దేశాలను విడిచిపెట్టి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయి శరణార్థులుగా జీవిస్తున్నారని, సూడాన్ అంతర్యుద్ధం కారణంగా ఒక్క ఏప్రిల్లోనే 20 లక్షల మంది నిరాశ్రయులైనట్టు ఐక్యరాజ్య సమితి శరణార్థుల హైకమిషనరేట్ (యూఎన్హెచ్సీఆర్) వెల్లడించింది.
ప్రపంచ శరణార్థుల దినోత్సవం; - సి.హెచ్.ప్రతాప్
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి