'అంతర పంటలతో అధిక లాభాలు';--ఎస్ఎల్ఎం ప్రాజెక్టు మేనేజర్ సతీష్ కుమార్

  ప్రధాన పంటలో రైతులు అంతర పంటలు వేసుకోవడం వల్ల అధిక లాభాలను సాధించవచ్చని బిసిఐ ఎస్ఎల్ఎం ప్రాజెక్ట్ మేనేజర్ సతీష్ కుమార్ అన్నారు. డబ్ల్యూ డబ్ల్యూఎఫ్ బిసిఐ కేశవాపూర్ ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో రీజనరేటివ్ అగ్రికల్చర్ లో భాగంగా   సోమవారం కాల్వశ్రీరాంపూర్  మండలంలోని పందిళ్ళ గ్రామంలో పచ్చిరొట్ట ఎరువు తయారు చేసుకోవడంలో మెకువలను ఆయన రైతులకు వివరించారు. గత నెల క్రితం సీర కొమురయ్య వ్యవసాయ క్షేత్రంలో నవధాన్యాలు చల్లడంతో ఏపుగా పెరిగిన మొక్కలను ఆయన తన సిబ్బంది, రైతులతో కలిసి పరిశీలించారు. గుబురుగా పెరిగిన నవధాన్యాల మొక్కలతో పచ్చిరొట్ట తయారు చేసే విధానాన్ని రైతులకు తెలియజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సతీష్ కుమార్ మాట్లాడుతూ...పప్పు జాతి విత్తనాలతో పచ్చిరొట్ట ఎరువు తయారు చేసుకోవడం వల్ల రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గి, అధికంగా పంట దిగుబడులు వస్తాయన్నారు. పచ్చిరొట్ట తయారు చేసుకోవడం వల్ల భూసారం పెరుగుతుందని, రైతులు పూర్తిగా రసాయనక ఎరువుల వాడకం తగ్గించాలని ఆయన సూచించారు. పచ్చిరొట్టతో  ఎరువుల తయారీ అనేది పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుందని, ఇది 'పర్యావరణహితకారి' అని సతీష్ కుమార్ తెలిపారు. పత్తితో పాటు ఇతర ప్రధాన పంటల్లో పెసరు, కందిని అంతర పంటలుగా వేయడం వల్ల రైతులు అధిక దిగుబడిన సాధించవచ్చని, ఆ దిశగా రైతులు ప్రయత్నం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో బీసీఐ యూనిట్ మేనేజర్ సాయి ప్రకాష్ రెడ్డి, ప్లాంటేషన్ ఇంచార్జి విష్ణు, ఫీల్డ్ ఇంచార్జ్ తూండ్ల అరుణ, బిసిఐ సిబ్బంది, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం