రామవనవాసం! అచ్యుతుని రాజ్యశ్రీ
 వాల్మీకి మహర్షి ప్రకృతి శోకాన్ని ఎంతో అందంగా వర్ణించారు.గాలి వ్యాకుల పడ్తోంది. పక్షులు మేతకు వెళ్లలేదు.గుర్రాలు ఏనుగులు కన్నీరు కారుస్తూ నిలబడితే సుమంతుని "త్వరగా రథం పోనీయండి" అన్నాడు రాముడు.కౌసల్య దశరథుడు వాకిలి దాకా రామా రామా అని ఏడుస్తూ వచ్చారు." కౌసల్యా! నేను మోదుగు చెట్టు పూలను చూసి మురిసి మామిడి తోటలను నరికిన మూర్ఖుడను.కైక వ్యామోహం లో పడి సర్వనాశనం చేసిన పాతకిని."అని ఏడుస్తూ " నీవు నన్ను పట్టుకో.రాముని తల్లి గా నీస్పర్శ తో దుఃఖం కాస్త తగ్గుతుంది" అన్నాడు.వృద్ధబ్రాహ్మణులు నిత్యాగ్నిహోత్రాలను మోస్తూ అర్థం వెంట పరుగులు పెడుతూ ఉన్నారు." మేము నడుస్తాం.జనమంతా ఆవృద్ధబ్రాహ్మణులు పరుగులు పెడుతున్నారు" అని సీతతో సహా రామలక్ష్మణులు దిగి నడిచి తమసా తీరంలో నిద్రపోయారు.అంతా ఆదమరిచి నిద్రలో ఉన్న సమయంలో సుమంతుడు రాముని ఆనతిపై రథం నడిపాడు."జనం రథచక్రాలు చూసి మనం వెళ్లే చోటుకి వస్తారు.అలా రాకుండా ఉత్తర దిశగా పోనివ్వు.మళ్ళీ వెనక్కి తిప్పి గడ్డిపై తమసానదివైపు నడుపు.మనం అయోధ్యకి తిరిగి వెళ్ళాంఅనే భ్రమలో వారు రథచక్రాల గుర్తులు కానరాక వెళ్లి పోతారు.కోసలరాజ్యసరిహద్దుల్లో గ్రామ అధిష్ఠానదేవతను ప్రార్థించి కోసలరాజ్య సరిహద్దు దాటారు ఆముగ్గురు.సుమంతుడు బాధతో ఖాళీరథంతో వెళ్తే గుహుడు ఉండే శృంగిదేవపురం చేరారు.రాముని విచక్షణ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ సీత లక్ష్మణుడు ప్రేమ తెలుస్తోంది కదూ?🌷

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం