అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ;- అవధానం అమృతవల్లి
ఆమె ఇప్పుడు  అప్పుడు  పొరలు పొరలుగా
విడిపోతూనే ఉంది
బంధాలు భాధ్యతల చట్రం లో చెరుకు గడలా నలిగి పోతూనే ఉంది
తీపిని పంచుతూ  ఎందుకూ పనికిరాని పిప్పిలా మిగిలిపోతూనే ఉంది

ఇంటా బయట గౌరవాన్ని నిలబెట్టుకోటానికి
నిరంతరం గానుగెద్దులా తిరుగుతూనేఉంది
నిద్ర పొద్దులను తరిమేసి నిశితో స్నేహము చేస్తోంది..
అలిసిపోతున్న శరీరానికి పట్టుదల తైలాన్ని
పూసి ముందడుగు వేస్తోంది..

ఇరవైనాలుగుగంటల్లో తనకోసం ఓ గంటను నిలుపుకో లేకుంది..
మరో గంట ఉంటే బావుణ్ణు అని  నిట్టూర్పు సెగల్ని కప్పుకుంటోంది.

లోలోపలి తన శక్తిని తైలంగా చేసి ఇంటిదీపమై నిరంతరం వెలుగుతూనే ఉంది..
ఒక్కో అవయవం చెదలు పట్టినట్లు డొల్లగా
మారుతున్నా గుర్తించలేకుంది..
మమకారాల బందీఖానాలో  బంగారు చిలుకలా చిక్కుకుపోయింది

తన ప్రతిభ ఎన్ని రంగాల్లో విస్తరించినా
ఇంకా తను కేవలం అవసరంగానే మిగిలిపోతోంది..
మనిషి ఉనికికి తాను చేసుకున్న ఒడంబడికకు
రక్తపు నదిలా ప్రవహిస్తూనే ఉంది..

ఎన్ని లోగిళ్ళలో చిరునవ్వుల మల్లెలా విరిసిందో
ఎన్ని గుండెల కాన్వాసుపై హరివిల్లు సంతకాల్ని చేసిందో..
మానవతా ఛత్రమై పుడమిని కాస్తూ
నిర్లక్ష్యాల నీడలు తరుముకొస్తున్నా తమాయించుకుంటోంది.

కన్నీళ్ల సంద్రాల్ని చెలియలి కట్టదాటనివ్వక
ఆశల తెరచాపలెత్తి ..
సంయమన తీరాల్లో విజయ బావుటాల్ని ఎగరేస్తూనే ఉంది.
ఆకాశపు హద్దుల్ని చెరిపేస్తూ నింగి తారకతో పోటీ పడుతోంది..



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం