అవయవ దానం ప్రాశస్థ్యం ;- సి.హెచ్.ప్రతాప్
 ప్రపంచంలోనే అత్యంత తక్కువ అవయవ దానం చేసే దేశాల్లో భారత్‌ ఒకటిగా కొనసాగుతోంది. భారతదేశంలో, అవయవ దానం రేటు చాలా తక్కువగా ఉంది.అవయవాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు.మన దేశానికి ప్రతి ఏడాదికి సుమా రు మూడు లక్షల మంది నేత్ర దాతల అవసరమున్నది. కానీ అతికష్టం మీద యాభై వేల మంది మాత్రమే లభిస్తున్నారు. మరణాల సంఖ్య అధికంగా నమోదవుతున్నా, అవయవ దానం చేసేవారి సంఖ్య ఆ స్థాయిలో ఉండటం లేదు. వారి కుటుంబ సభ్యులకు, బంధువులకు గల సాంప్రదాయపు ఆలోచనలు, ఆచారాలు, కట్టుబాట్లు, అవగాహనాలోపం తదితర కారణాల వల్ల నేత్రదానం చేయడానికి అందరూ అంగీకరించకపోవడం వల్ల పవిత్రమైన అవయవదాన ప్రక్రియకు అవాంతరాలు ఎదురవుతున్నాయి.అవయవ దానం మానవ శరీర పరిశోధన కు ఉపకరిస్తుంది. వైద్య విద్యార్థులకు శరీరం లోని అవయవాల పని తీరుపై అవగాహన కల్పిస్తారు. వైద్యశాస్త్ర అభివృద్ధికి ఉపకరిస్తుం ది. అవయవ దానం ద్వారా కొత్త జీవితం లభిస్తుంది.అవయవ దానం అవశ్యకత ను అందరం గుర్తించేలా ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు పెద్ద ఎత్తున ఉపక్రమించాలి. అవయవాలు అందుబాటులో లేక ఎందరో రోగులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. అవగాహనాలోపం, అపోహలు అవయవదానానికి ప్రధాన ప్రతిబంధకాలుగా మారాయి. మనకు అవసరం వచ్చినప్పుడు కాకుండా అందరి కోసం అవయవ దానంపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి. జీవన్‌దాన్‌లో పెద్ద సంఖ్యలో దాతల పేర్లు నమోదయ్యేలా చూడాలి. మనకు తెలిసిన వారు బ్రెయిన్‌డెడ్‌ అయిన సందర్భాల్లో వారి కుటుంబాలను ఒప్పించి అవయవాలను దానం చేయించాలి.మూత్రపిండాలు, కళ్ళు, కాలేయం, గుండె, చర్మ కణజాలాలు, చిన్న ప్రేగులు మరియు ఊపిరితిత్తులు సాధారణంగా ప్రజలు దానం చేసే కొన్ని అవయవాలు. అవయవ దానంలో పాల్గొనడం అనేది దాతృత్వం మరియు సామాజిక సేవ యొక్క గొప్ప రూపం. ఇది మరణం తర్వాత వ్యక్తుల సహకారాన్ని సూచిస్తుంది. మనమందరం ప్రాణాలను కాపాడేందుకు మన అవయవాలను దానం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి మరియు వివిధ ప్రచారాలలో పాల్గొనడం ద్వారా అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను ప్రచారం చేయాలి.అవయవ దానం అనేది జీవితాలు, కుటుంబాలు మరియు సమాజాలను మార్చే సామర్థ్యాన్ని కలిగి ఉన్న అసాధారణ బహుమతి. అవయవ దానం యొక్క క్లిష్టమైన అవసరాన్ని అర్థం చేసుకోవడం, అపోహలను తొలగించడం మరియు దాతగా మారడానికి ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం ద్వారా, వ్యక్తులు తమ స్వంత జీవితాలను అధిగమించే శాశ్వత ప్రభావాన్ని వదిలివేయవచ్చు. ఈ దయతో కూడిన చర్య ద్వారా, నష్టం యొక్క విషాదాన్ని మనం పునరుద్ధరించిన జీవితం యొక్క ఆశగా మార్చగలము. 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం