సునంద భాషితం;- వురిమళ్ల సునంద, డల్లాస్ అమెరికా
 న్యాయాలు-531
తప్త మాక్షికోద్ధరణ న్యాయము
******
తప్త అనగా కాచబడినది,కరిగించబడనది,బాధించబడినది,ఆచరించబడినది.మాక్షికం అనగా తైల/నువ్వుల నూనె వర్ణములో ఉన్న తేనె. ఉద్ధరణ అనగా పెకిలించుట,వస్త్రాదులు విడుచుట,లాగుట, తుడిచి పెట్టుట, ఋణము నుండి విముక్తుడగుట.
 కాగిన నువ్వుల నూనె లాంటి తేనెలో పడిపోయిన ఈగను నేర్పుగా వేలితో తీసివేయ వచ్చును.
అనగా అభ్యాసము వలన మంచి ఫలితములు పొందుతారు అనే అర్థంతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
 అభ్యాసం అంటే ఒక విధంగా నిరంతర సాధన అని అర్థము.దేనిపై అయితే దృష్టి పెడతామో దానిని సాధించేందుకు ఆటంకాలను అధిగమించి కృషి చేస్తారో వారికి ఆ పని అత్యంత సులువుగా చేయగల సామర్థ్యం సొంతమవుతుంది.దీనినే మన పెద్దలు "అభ్యాసం కూసువిద్య" అని అంటుంటారు.
 మరి ఏదైనా అభ్యాసము చేయాలంటే ఆ యా వ్యక్తులకు శ్రద్ధ,ఆసక్తి రెండూ మెండుగా వుండాలి. ఏ విద్య నేర్చుకోవాలన్నా, అందులో నైపుణ్యం రావాలన్నా తప్పకుండా సాధన అవసరం. అందుకే ఓ పాటల రచయిత "సాధన చేస్తూ పదం కలిపితే సాధించలేనిది ఏముంది? " అంటారు.
దేనినైనా ఇష్టంగా నేర్చుకోవాలి.అప్పుడే కష్టం అనిపించదు.కష్టంగా భావిస్తే అందులో ఎప్పుడూ నిపుణత ఎప్పుడూ సాధించలేము.ఎన్నిసార్లు చేసినా కొత్తగానే ఉంటుంది.అందుకే సాధనలో త్రికరణ శుద్ధి కావాలని మన పెద్దలు అంటుంటారు.
 ఎవరైనా ఒక వ్యక్తి తన విద్వత్తులో కానీ, తనకు నచ్చిన వివిధ కళలలో కానీ అత్యున్నత స్థాయికి చేరుకోవడానికి కారణము వారు పట్టుదలతో చేసిన నిరంతర కృషి మరియు సాధనే.
" సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయమనకుంటే పొరపాటోయీ " అంటారు మహా కవి శ్రీ శ్రీ గారు.కాబట్టి సాధనకు ఇక చాలు అనే విరామము వుండదు.పుల్ స్టాప్ పెట్ట కూడదు. సాధనకు దూరం కాకూడదనేది అనుక్షణం గమనంలో ఉంచుకోవాలి.
అలా చేసిన సాధనతో వచ్చిన ప్రావీణ్యం వల్ల తేనెలో పడిన ఈగనే కాదు చీమను కూడా అలవోకగా తీయగలము.ఇదంతా అభ్యాసం వల్ల పొందిన ఫలితమే.
ఇలాంటి ఎన్నో విషయాలను మనం "తప్త మాక్షికోద్ధరణ న్యాయము" ద్వారా తెలుసుకోగలిగాం.మరి మనము కూడా మనకు నచ్చిన,నలుగురు మెచ్చిన కళను వజ్రంలా సానబెట్టుకొందాం.నిరంతర అభ్యాసంతో అందులో పట్టు సాధించి అవలీలగా చేయగలిగే సామర్థ్యాన్ని సొంతం చేసుకుని మంచి ఫలితాలను పొందుదాం.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం