ప్రభుత్వ బడిలో చేరితే ప్రత్యేక బహుమతులు ;--రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య
ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ  ప్రభుత్వ ప్ర్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు ప్రత్యేక బహుమతులను తన సొంత ఖర్చులతో
అందజేస్తానని రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య తెలిపారు. బుధవారం ఆయన ఎస్సీ కాలనీ ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు ప్రభుత్వ నుండి వచ్చిన ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, వర్క్ బుక్కులను అందజేశారు. పాఠశాల టీచర్లు, పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్తులతో కలిసి పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పిల్లలకు స్వాగతం పలుకుతూ వారిని పాఠశాలలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ... ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఆటపాటలతో కూడిన కృత్యాధార బోధనను అందిస్తున్నామన్నారు. సకల సౌకర్యాలతో పాఠశాలను అందంగా, ఆకర్షణీయంగా, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేసినట్లు ఆయన తెలిపారు. 2024 - 2025 విద్యా సంవత్సరంలో ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేరిన పిల్లలకు ఉచితంగా తన సొంత ఖర్చులతో రాత పుస్తకాలు, పెన్నులు, పెన్సిల్లు, రబ్బర్లు, చాక్మార్లు, బడి సంచులు ఇంకా ప్రత్యేకమైన బహుమతులు అందజేస్తానని ఈర్ల సమ్మయ్య తెలిపారు. చారిత్రక నేపథ్యం కలిగిన ప్రాంతాలు రామప్ప, వేయి స్తంభాల గుడి, లక్నవరం చెరువు సందర్శన చేయిస్తానని, పాఠశాలలో నవోదయ, స్పోకెన్ ఇంగ్లీష్, కాలిగ్రఫీ  (హ్యాండ్ రైటింగ్ నేర్పడం) లో ప్రత్యేక శిక్షణనిస్తామన్నారు. పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, తల్లిదండ్రులు త్వరపడి తమ పిల్లల్ని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయినులు ఎడ్ల విజయలక్ష్మి, కర్ర సమత, చెన్నూరి భారతి, పిల్లలు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం