ప్రశాంత జీవనానికి కర్మయోగం;- సి.హెచ్.ప్రతాప్
 జీవ తత్వాన్ని తెలుసుకోవటానికి అవసరమైన మొత్తం జ్ఞానం భగవద్గీతలో వుంది.  కులమతాలతో.. దేశప్రాంతాలతో.. సంబంధం లేకుండా అందరూ అనుసరించదగిన గ్రంథం భగవద్గీత కాబట్టే నేటికి కోట్లాది మంది ప్రపంచ వ్యాఒతంగా భగవద్గీతను నిర్విరామంగా చదువుతున్నారు.. ఎటువంటి సంకటాలు లేని ప్రశాంత జీవితాన్ని గడపటానికి అనుసరించదగిన సాంఖ్య యోగము, కర్మ యోగము, భక్తి యోగము అనే మూడు మార్గాలు దీనిలో ఉన్నాయి. అందులో ముఖ్యమైనది కర్మ యోగం. కర్మ యోగ మార్గంలో ప్రతి కర్మకు కర్త ఉంటాడు. కర్మ చేయటం వల్ల కలిగే కర్తఫలము కూడా ఉంటుంది. కర్తకు కర్మ చేసే హక్కు ఉంటుంది. కానీ కర్మఫలంపై అతనికి ఎటువంటి నియంత్రణ ఉండదు. దీనినే శ్రీకృష్ణుడు- ‘‘అన్ని కర్మలు- సత్వ, తమో, రజోగుణాల వల్ల జరుగుతాయి. ఈ గుణాలు ప్రకృతి వల్ల ప్రేరేపితం అవుతాయి. అందువల్ల జాగ్రత్తగా తరచి చూస్తే మనం కర్తలు కూడా కాదని అర్ధమవుతుంది’’ అని చెబుతాడు. కర్మలు చేయటం వెనక కూడా ఒక పరమార్థముందని.. కర్మలను చేయకపోతే ఈ భౌతిక దేహం యొక్క అస్థిత్వతే ఉండదని చెబుతాడు.బాహ్యంగా కర్మలు ఆచరిస్తూనే ఉన్నా, లోనుండి మమకార రాహిత్యంతో ఉండే, కర్మ యోగము ఆచరించే వారు, ఉన్నతమైన వారు. భగవంతుని సృష్టి వ్యవస్థలో ప్రతి ప్రాణికి తన వంతుగా నిర్వర్తించే బాధ్యతలు ఉంటాయని శ్రీ కృష్ణుడు చెప్పాడు.మనము చేయవలసిన ధర్మాన్ని భగవంతుడు ఇచ్చిన కర్తవ్యంగా చేసినప్పుడు ఆ పని 'యజ్ఞం' అవుతుంది. యజ్ఞం చేయటం సహజంగానే దేవతలకు ప్రీతి కలిగిస్తుంది, దాంతో వారు భౌతిక అభ్యుదయం ప్రసాదిస్తారు. అలాంటి యజ్ఞం వానలు కురిపిస్తుంది, వానలతో జీవనాధారమైన ధాన్యం వస్తుంది. ఈ చక్రంలో తమ బాధ్యతని స్వీకరించటానికి నిరాకరించిన వారు పాపిష్టులు; వారు తమ ఇంద్రియ లౌల్యం కోసమే జీవించేవారు మరియు వారి జీవితాలు వ్యర్థమైనవి.హృదయపూర్వక సేవ అస్సలు సేవ కాదు. మీరు సేవ చేసేటప్పుడు మీ పూర్ణ హృదయాన్ని, మనస్సును మరియు ఆత్మను ఇవ్వండి. మీరు కర్మ యోగ సాధన చేసినప్పుడు ఇది చాలా ముఖ్యం.
కొంతమంది తమ శరీరం ఒక చోట, మనస్సు మరొక చోట, ఆత్మ మరొక చోట ఉంటాయి. వారు మార్గంలో గణనీయమైన పురోగతిని గుర్తించకపోవడానికి కారణం అదేనని స్వామి శివానంద చెబుతారు. 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం