స్ఫూర్తి దాతలు 3_ అచ్యుతుని రాజ్యశ్రీ
 కేవలం చదువు డిగ్రీ కాదు.స్వయంకృషితో ఆలోచన తో తాను నడుస్తూ ఇతరులకు మార్గదర్శకులు కావాలి. గుడిసెలో ఉండే దుర్గా దేవి అనే బాలిక కరెంటు లేకున్నా గవర్నమెంట్ స్కూల్ లో చదివి టెన్త్ క్లాసు లో బడిలో ఫస్ట్  జిల్లా లో రెండోస్థానంలో నిల్చింది.తమిళనాడు ప్రభుత్వం వెంటనే స్పందించి ఉచితంగా కరెంటు ఇవ్వడం ముదావహం
ఝార్ఖండ్ కి చెందిన శకుంతల  అమ్మ నాన్న కు 7గురుపిల్లలు.బడి బాల్యంలోనే దూరం 19 ఏళ్ళకే పెళ్లి. ఊళ్ళో ని ఆడవారి తో సంఘంగా ఏర్పడి శిక్షణ తీసుకుని రాగిపిండితో లడ్డు బిస్కెట్లు లాంటివి తయారు చేసి   వ్యాపారం లో రాణిస్తోంది.చదువు లేకున్నా తన సత్తా చాటుతోంది.
మనం కొబ్బరి ఆకులతో బొమ్మ లు చేస్తాంసరదాగా. కానీ ఉత్తరాఖండ్ కి చెందిన నుపుర్  వెటర్నరీ డిగ్రీ పొందింది. తండ్రి పశువుల డాక్టర్. ఖేతిఖాన్ అనే పల్లెలో ఆడవాళ్ళు వ్యవసాయం చేస్తారు. పంటలు సరిగ్గా పండవు.పైన్ చెట్లు వల్ల  అడవిలో అగ్గి రాజుకోటం చూసి నుపుర్ ఆరాలిన పైన్ ఆకుల్తో బుట్ట టోపి గిన్నెలు చేసి ఆడవారికి నేర్పింది. నగలు కూడా తయారు చేసి అక్కడి మహిళలకు ఉపాధి కల్పించడం ముదావహం. ఎగ్జిబిషన్ల ద్వారా మంచి ప్రచారం లోకి పైన్ చెట్ల ఆకులతో ఉపయోగం తెల్పింది. బెస్ట్ ఔటాఫ్ వేస్ట్ అంటే ఇదే కదూ🌹

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం