వీరుడంటే వీడే (సంయుక్త అక్షరాలు లేని బాలల కథ) డా.ఎం.హరికిషన్-కర్నూలు9441032212

 ఒక ఊరిలో ఒక పొట్టెగాడు వుండేటోడు. వానికి వాళ్ళ తాత ఎప్పుడూ రాజుల కథలు బాగా వివరించి వివరించి చెప్పేటోడు. దాంతో ఆ పొట్టెగానికి పండుకున్నప్పుడు అవే కలలు వచ్చేటివి. దానికి తోడు వానికి పడుకున్నప్పుడు లేచి అటూ యిటూ తిరిగే అలవాటు వుండేది. దాంతో వాళ్ళ అమ్మా నాన్నా భయపడి వాడు పండుకున్నప్పుడు లేచి బైటికి పోకుండా తలుపులకి గడియ పెట్టేటోళ్ళు.
ఒకసారి ఆ వూరి మీదకు పక్క దేశపు రాజు యుద్ధానికి వచ్చినాడు. వాళ్ళంతా వూరిబైట చుట్టుముట్టి ''మట్టసంగా  లొంగిపోతారా... లేక యుద్ధానికి రమ్మంటారా'' అని హెచ్చరిక పంపినారు.
రాజుకి ఏం చేయాలో తోచలేదు. పక్క రాజేమో చానా బలవంతుడు, చెడ్డోడు. యుద్ధం జరిగితే ఓడిపోవడం ఖాయం. దాంతో పాటు వూరినంతా నాశనం చేసిగానీ వదలడు. అలా అని లొంగిపోడానికి మనసు ఒప్పుకోలేదు. ఎలాగబ్బా ఈ ఆపద నుంచి బైటపడడం అని తెగ ఆలోచించసాగినాడు.
ఆ రోజు చీకటి పన్నాక ఆ పొట్టెగానికి పండుకున్నప్పుడు తాను ఆ వూరికి రాజయినట్టు, గుర్రమెక్కి యుద్ధానికి పోతున్నట్టు కల వచ్చింది. అదే సమయంలో పక్కనున్న అడవిలోంచి ఒక పెద్ద పులుల గుంపు ఆ వూరిలోనికి వచ్చింది. అన్ని పులులను ఒకేసారి వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. దాంతో అందరూ వణికిపోయి ఎక్కడి పనులు అక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోసాగినారు. ఆ తొందరలో ఈ పిల్లవాని అమ్మానాన్నా గూడా పారిపోతా పారిపోతా వీని తలుపుకు గడియ పెట్టడం మరిచి పోయినారు. దాంతో వాడు వానికి తెలియకుండా బైటకు వచ్చినాడు.
సరిగ్గా అదే సమయానికి ఆ పులుల గుంపు వీని ఇంటి ముందుకు వచ్చింది... వీడు నిదురలో వున్నాడు గదా... ఎదురుగా వున్నది గుర్రాలే అనుకున్నాడు. దాంతో అన్నింటికన్నా పెద్దగా వున్న ఒక పులిని చూసి ఎగిరి దాని మీద కూచుని ''ఏయ్‌.... ఛల్‌... పద'' అన్నాడు. దాంతో పులులన్నీ భయపడిపోయినాయి. ''ఇదేందిరా అందరూ మా గుంపుని చూసి భయంతో వణికిపోతా వుంటే... వీడు వంద పులులు ఎదురైనా ఒక్కడుగు గూడా వెనక్కు వేయకుండా... ఏకంగా మా నాయకుని మీదకే ఎక్కేసినాడు. వీడు చానా పెద్ద వీరుడున్నట్టున్నాడు. అనవసరంగా గొడవ పెట్టుకోకుండా వీడు ఎలా చెబితే అలా చేయడం మంచిది'' అనుకున్నాయి.
వాడు పెద్దపులి ఎక్కి ముందు పోతావుంటే వెనుకనే వంద పులులూ మట్టసంగా భయపడతా భయపడతా రాసాగినాయి. వాడు ఛల్‌... ఛల్‌... అని అదిలించుతా వూరి బైటకు వచ్చినాడు. అక్కడ పక్క వూరి సైనికులు గుడారాలు వేసుకోని తరువాత రోజు యుద్ధానికి కత్తులు నూరుకుంటా వున్నారు. వాళ్ళు వీడు వందపులులతో రావడం చూసినారు. అంతే... ''ఓరి నాయనోయ్‌... ఎవడురా వీడు. గుర్రాల మీద రావడం చూసినాం, ఏనుగుల మీద రావడం చూసినాం, ఒంటెల మీద రావడం చూసినాం.... గానీ ఇలా పులుల మీద ఎక్కి వచ్చినోని గురించి ఇంతవరకు ఎప్పుడూ వినలేదు. కనలేదు. వీడెవడో మహావీరుడు వున్నట్టున్నాడు. వాటికి గనుక దొరికినామంటే ఎక్కడికక్కడ ముక్కలు ముక్కలు చేసి నంజుకోని తింటాయి'' అనుకుంటా భయపడి కత్తులూ, బళ్ళాలూ ఎక్కడివక్కడ వదిలేసి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోసాగినారు.
ఈ గొడవకి వానికి మెలకువ వచ్చింది. ఎక్కడున్నానబ్బా అని చుట్టూ చూసినాడు. ఇంకేముంది. పెద్దపులి మీదున్నాడు. భయంతో గుండెలు కొట్టుకున్నాయి. కాళ్ళూ చేతులు వణికినాయి. ''ఎలారా నాయనా వీటి నుంచి తప్పించుకోవడం'' అని అటూ యిటూ చూడసాగినాడు. అంతలో ఎదురుగా ఒక మామిడి పళ్ళ చెట్టు కొమ్మ ఒకటి బాగా కిందికి వంగి కనబడింది. అంతే... అది దగ్గరికి రాగానే లటుక్కున దాన్ని పట్టుకోని పైకి ఎక్కినాడు.
''వాడు ఎప్పుడెప్పుడు దిగుతాడా... ఎప్పుడెప్పుడు ఇక్కన్నించి పారిపోదామా'' అనుకుంటావున్న పులులు వాడు చెట్టుపైకి ఎక్కగానే ''వాడు మామిడి పళ్ళ కోసం పైకి ఎక్కినట్టున్నాడు. మళ్ళీ దిగి వచ్చినాడంటే మనలను వదలడు'' అనుకుంటా ఎక్కడివక్కడ చించుకోని అడవిలోనికి పారిపోయినాయి. వాడు అవి పోయిన కాసేపటికి 'హమ్మయ్య' అనుకుంటా తిరిగి వూరిలోనికి అడుగు పెట్టినాడు.
అక్కడ రాజు దండ చేతిలో పట్టుకోని కనబన్నాడు. వీడు రాగానే మెళ్ళో దండేసి ''నీలాంటి వీరున్ని ఇంతవరకూ మేమెప్పుడూ చూల్లేదు. నీవు ఈడ వున్నంతకాలం ఇంక మేమెవరికీ భయపడవలసిన అవసరమే రాదు'' అని బాగా మెచ్చుకోని మోయలేనంత బంగారం బహుమానంగా ఇచ్చి గౌరవించినాడు. వానికి ఆ పులుల దెబ్బతో అప్పటి నుంచీ నిదురలో నడిచే అలవాటు కూడా పోయింది.
***********

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం