ఆకాశవాణి విజయవాడ కేంద్రం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 శ్రోతరకు విసుగు లేకుండా కార్యక్రమాన్ని వేగంగా నడపాలి అందరూ సిద్ధహస్తులు రత్న బోస్  ఆయన ఆస్థాన కవి రచయిత వేదాంతం శరత్ చంద్రబాబు ఏనాటిక కావాలన్నా ఏ సంగీత రూపకం ప్రదర్శించారన్న తను ఆఖరి క్షణంలోనైనా అందించగలడు ఎక్కువగా కార్మికుల కార్యక్రమాలలో ప్రస్తుతం ఉన్న యువవాణి ఆ రోజుల్లో యువ భారతి పేరుతో ప్రసారమవుతుండేవి ఈ రెంటిలోనూ ఎక్కువ భాగం బోస్ సమర్పణలోనే ఉండేవి ఈయన నాటకాలు వేస్తున్నంతకాలం శ్రీరామ్మోహన్ రావు గారు కథానాయకుని పాత్ర ఇచ్చేవారు కాదు ఎక్కువగా హాస్య పాత్రలు క్యారెక్టర్ వేశారు ఒకసారి కారణం అడిగితే నీవు ఆనంద్ ను అనుపరిస్తున్నావు ఆ నాటకం మొత్తం వింటే ఆనంద్ కనిపిస్తాడు బోస్ కనిపించడు అంతే తప్ప నీ మీద వేరే అభిప్రాయం లేదు అని చెప్పాడు రామ్మోహన్ రావు గారు  నేను ఆయనను అనుకరించడం లేదు నా కంఠమే అలాంటిది   స్వతహసిద్ధంగా మా రెండు కలిసిపోయిన స్వరాలు అని చెప్పినా వినిపించుకోలేదు.హైదరాబాదులో శ్రీకృష్ణదేవరాయలు నాటకం ప్రదర్శించారు అందులో తను రాయల వేషo వేశారు తుర్లపాటి రామచంద్ర రావు గారు తిమ్మరసు పాత్ర  పోషించారు  నాటకం మొత్తం అయిన తర్వాత స్నేహితులంతా ఎస్వీ రంగారావు గారిని మరిపించారు అని అభినందించారు  విగ్రహాల రామారావు అని గుంటూరు ఆర్టీసీలో పనిచేస్తూ ఉండేవాడు  అక్కడి కార్మికులతో కదంబ కార్యక్రమాలను సమర్పిస్తూ ఉండేవాడు యంత్రాలతో కూడా  మంత్రం వేసి నాటక సంభాషణలను చెప్పించడంలో దిట్ట  నాటకాలలో కూడా బోసును నటింప చేసేవాడు  అతనిని రాముడు అని పిలుచుకుంటాం  రాముడు రంగస్థలం నాటకాలలో  ఆరితేరిన వాడు  తను నటిస్తూ దర్శకత్వ బాధ్యతను వహించి మంచి నటులను తయారు చేశాడు.తనకు ఆచార్య ఆత్రేయ గారితో చదువుతో వారు రచించిన అశోకుడు నాటకం హక్కులను తీసుకొని రంగస్థలం పైన నటించడమే కాకుండా ఆకాశవాణిలో కూడా ప్రదర్శించడానికి అనుమతి పొందాడు  ఆనాటకాన్ని రేడియోలో నేను నిర్వహించాను బోస్ తో పాటు  ఎన్ వి ఎస్ వర్మ టి నరసరాజు కూడా నటించాడు  వర్మ గారు పోస్ట్ ఆఫీస్ లో  పోస్ట్మాస్టర్ గా ఉద్యోగం చేసేవాడు అటు రంగస్థలం మీద నటిస్తూ హీరో కృష్ణ ఎన్టీ రామారావు గారితో చాలా సినిమాలు కూడా చేశాడు  నరసరాజు ఆర్టీసీలో పని చేస్తూ రాముడు దగ్గర  నాటకాలు వేస్తూ సొంతంగా కొంతమందిని సమీకరించుకొని అనేక నాటకాలు ప్రదర్శించాడు కూడా  కొంతమంది కధా నాయికలను రంగస్థల  ప్రవేశం చేయించాడు.
==========================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం