బుద్ధుని మొదటి ప్రవచనం;- చిరసాని శైలూషి,నెల్లూరు.

 కొంతకాలం ఆలారా కాలముని బోధలు విని సిద్ధార్థుడు కాలమా మీరు సాధించిన ప్రజ్ఞతో మీరు దర్శించినది ఏమిటి అని అడిగాడు అందుకు కాలాముడు మిత్రమా నేను  శూన్యతా భూమిక ను అంటే శూన్యత స్థితిని చేరుకొని ఏకాగ్రతను సాధించాను అని చెప్పాడు ఆయన బోధన సిద్ధార్థులు కూడా కాలాముని మాదిరిగానే శ్రద్ధ వీర్యము స్మృతి సమాధి ప్రజ్ఞలను అభ్యాసం ద్వారా అనుభవంలోకి తెచ్చుకున్నాడు ఇది గమనించిన కాలాముడు సిద్ధార్థను ఉద్దేశించి మిత్రమా నేను దర్శించిన సత్యాన్ని మీరు దర్శించారు నాకు తెలిసిందే మీకు తెలిసింది నేను మీరు సత్యాన్ని ఒకేలా తీసుకున్నాము రండి మనం ఇద్దరం పరివ్రాజకుల సంఘాన్ని నెలకొల్పుదాం అని ఆహ్వానించారు.అంతకుమించి ముందుకు సాగని కాలామని ప్రజ్ఞ అంతిమ సత్యాన్ని అందించలేక పోయిందని గుర్తించాడు సిద్ధార్థుడు  పూర్తిగా సత్య దర్శనం కాని  తాను సంఘాన్ని స్థాపిస్తే చూపులేని వాడు మరో చూపు లేని వాడిని నడిపించినట్లు అవుతుంది అని కాలముని బోధన పట్ల సంతృప్తి చెందని సిద్ధార్థుడు పరిపూర్ణజ్ఞానం కోసం ధార్మిక ఉన్నత ప్రగతి కోసం కాలముని ని విడిచిపెట్టి అన్వేషణ కొనసాగించాడు అందులో భాగంగా సిద్ధార్థుడు వుద్దక రామ పుత్రుడని మరో మునిని కలుసుకున్నాడు పరమ సత్యాన్ని కనుగొనడానికి తాను తపన పడుతున్నానని మీరు అంగీకరిస్తే మీ బోధలు విని సాధన చేసి పవిత్ర జీవితం గడుపుతానని సిద్ధార్థుడు రామ పుత్రుడు తో అన్నాడు అందుకు సరే అన్న రామపుత్రుని శిష్యరికంలో సిద్ధార్థులు చిత్త ఏకాగ్రతతో చివరి దశ అయిన  సంజ్ఞ అసంజ్ఞ స్థితికి చేరాడు.
తరువాత సమాధిపరమైన సాధనలో ఉన్నతమైన ఉత్తమమైన స్థితిని పొందాడు కొద్దికాలంలోనే సిద్ధార్థులు సాధించిన ధార్మికోన్నత ప్రగతి పట్ల తృప్తి చెందిన ఉద్దక రామ పుత్రుడు ఆనందించి మిత్రమా నాకు తెలిసిందంతా నీకు తెలుసు నేను ఏమిటో మీరు అదే రండి యతి సంఘానికి మీరు నాయకుడుగా ఉండడానికి అంగీకరించండి అని కోరాడు అన్నిటికంటే ఉన్నతమైన తృష్ణ రాహిత్యాన్ని దుఃఖ నిరోధాన్ని అందించగల అంతిమ విముక్తి మార్గం ఇంకా అంతుచిక్కనందు వల్ల వుద్దకరామ పుత్రుని బోధలతో సంతృప్తి చెందని సిద్ధార్థుడు సత్యాన్వేషణలో భాగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు  పరమ సత్యాన్ని కనుగొనడానికి ఇతర గురువుల సహాయాన్ని తీసుకోవాలి అనుకున్న సిద్ధార్థులు తాను వెతుకుతున్న సత్యాన్ని ఎరుకపరిచే బోధలు చేసే వారు ఎవరు లేరు అని గుర్తించాడు అంతేకాక సాధన ద్వారానే పరమ సత్యాన్ని ఎవరికి వారే అనుభవoలోకి తెచ్చుకోవాలి అనుకున్నాడు  ఇక మీదట ఆ పనికి తానే పూనుకున్నాడు. 
=============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం