ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో పోటీ పరీక్షలకు శిక్షణ; -హెచ్ఎం ఈర్ల సమ్మయ్య


 కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ఇంగ్లీష్ మీడియం ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థిని పెంతాల అభిజ్ఞ  క్రీడా పాఠశాల ప్రవేశం కోసం జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీలో  అత్యంత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయింది. మంగళవారం ఊషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య స్థానిక స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం సునీత చేతుల మీదుగా విద్యార్థినికి ఇంగ్లిష్, తెలుగు డిక్షనరీని బహుకరించి, అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయిలో కూడా విద్యార్థిని అత్యంత ప్రతిభ కనబరిచాలని, కాంప్లెక్స్ హెచ్ఎం సునీత, పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, అమృత సురేష్, పాఠశాల కమిటీ చైర్మన్ లు ఆకాంక్షించారు. ఎస్సీ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నుంచి ఊషన్నపల్లి పాఠశాలకు బదిలీ అయిన ఈర్ల సమ్మయ్య మంగళవారం పాఠశాలలోని పిల్లలకు అరటిపళ్ళు, బిస్కెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల పిల్లలే ప్రతిభావంతులని, ఊషన్నపల్లి పాఠశాలలో రెగ్యులర్ పాఠ్యాంశాలతో పాటు గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్ ప్రవేశం కోసం ప్రత్యేకంగా శిక్షణనిస్తున్నామన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు పంపించే పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉషన్నపల్లి పాఠశాలలో చేర్పించి ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఈర్ల సమ్మయ్య కోరారు. పెంతాల అభిజ్ఞ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు  ఎన్నికవడం పట్ల మండల విద్యాశాఖాధికారి టి. సురేందర్ కుమార్, ఎంఎన్ఓ సిరిమల్ల మహేష్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం నరెడ్ల సునీత, పాఠశాల హెచ్ఎం ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్, పీడీ కుమారస్వామి, విద్యా కమిటీ చైర్మన్, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థిని అభిజ్ఞకు అభినందనలు తెలియజేశారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం