గురుశిష్య బంధం;- - జయా
 ఇక్కడ ఫోటోలో మీరు చూస్తున్నావిడ కేరళ రాష్ట్రంలోని మల్లపురంలో ఓ స్కూల్లో లెక్కలు టీచరుగా పని చేసినవారు. ఆవిడ స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో ఓ మూల కూర్చుని అడుక్కునేవారు.
అయితే ఆవిడ దగ్గర చిన్నప్పుడు చదువుకున్న ఒకరు ఓరోజు ఆవిడను గుర్తు పట్టారు. కానీ ఆవిడ ఆ విద్యార్థినిని గుర్తుపట్టలేదు.
ఆవిడకు నమస్కరించిన ఆ విద్యార్థిని తాను చదువుకున్న రోజులను గుర్తు చేసారు. అలాగా...బాగున్నావా అంటూ ఆవిడ తాను రిటైరయ్యాక తాననుకున్న పరిస్థితులన్నీ తల్లకిందులయ్యాయి. నా పిల్లలు నన్ను నిర్లక్ష్యం చేసి నన్నొదిలి వెళ్ళిపోయారమ్మా... అందువల్లే ఈ రైల్వే స్టేషన్ దగ్గర అడుక్కుంటున్నాను అని తన దీనస్థితిని చెప్పుకున్నారు. 
ఆ మాటలకు విద్యార్థిని తెగ బాధ పడింది. కంట తడిపెట్టింది.. టీచర్ని తన ఇంటికి తీసుకువెళ్ళింది. మంచి బట్టలు ఇచ్చి అన్నం పెట్టింది. అనంతరం ఆ విద్యార్థిని తనతో చదువుకునున్న మరికొందరు స్నేహితులను కలిసి టీచర్  స్థితి గురించి చెప్పింది. విద్యార్థులందరూ  కూడబలుక్కుని తమ లెక్కలు టీచర్ క్షేమంగా బతకడానికి తగిన ఏర్పాట్లు చేశారు.
ఆవిడ సొంత పిల్లలు ఆవిడను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆమె దగ్గర చదువుకున్న పిల్లలు ఆవిడను వదులుకోలేదు.
అదే గురుశిష్యుల మధ్య ఉన్న మహత్తు.

-

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం