నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ
 కొన్ని యథార్థాలు విన్నా చదివినా నమ్మలేం.వాస్తవం కాదు అనుకుంటాం.రుడ్ యార్డ్ కిప్లింగ్ తన" జంగిల్ బుక్ " లోఅడవి జంతువుల చేత పెంచబడిన బాలుడికథ రాశాడు.సాధారణంగా తోడే లు  ఇలా మనిషి పిల్లల ని  ఎత్తుకుపోయి పెంచిన ఆధారాలున్నాయి.అమల కమల అనే ఆడపిల్లలను తోడేళ్లు పెంచాయి.మనదేశంలో మిడ్నపూర్ అటవీప్రాంతంలో దొరికారు వారు. తమ పిల్లల తో ఈఇద్దరు బాలికల ను తోడేళ్లు పెంచడంతో వారి నడవడి ప్రవర్తన అంతా తోడే ళ్లు గానే ఉండిపోవటం ఆనాడు దేశంలో సంచలనం సృష్టించింది. ఒక చర్చి ప్రీస్ట్ కంట పడినవీరిని అనాథాశ్రమంలో ఉంచారు. అమల కొద్దిరోజులకే చనిపోయింది. కానీ కమల16ఏళ్లు బతికి మనిషి లాగా నడవటం మన భోజనం తినటం కొన్ని పదాలు పలకడం నేర్చుకుంది. 1973 లో శ్రీలంకలో టిస్సా అనే తోడేలు పెంచినబాలుడు అడవిలో దొరికాడు.ఎలుగుబంటి తోడేలు మనిషి పిల్లలని సాకటం నమ్మలేని నిజం!!
కొన్ని ఆఫ్రికన్ కరీబియన్ మతాల ప్రకారం జోంబీ అనే చనిపోయిన వ్యక్తి ని మాంత్రికుడు బతికించి తన బానిసగా మారుస్తాడు.    ఈజోంబీలు మనిషి లాగా ఊపిరి పీలుస్తూ ఆహారం తింటూ కదులుతూ ఉంటాయి. కానీ స్వతంత్రం గా ఆలోచించలేవు.భయంకరమైన అరుపులు మనకు వినపడతాయి.1980 లో ఒక స్త్రీ  అలా ఊరికే తిరిగేదిట పల్లెలో.ఆమె 1966 లో చనిపోయింది. హైతీ ప్రాంతం లో ఆడజోంబీ  నడిచే కొయ్యబొమ్మలా సంచరించడం చాలా మంది చూశారు. ఫెలీషియా అనే తన కూతురు చనిపోతే1907లో సమాధి చేశానని ఆమె తండ్రి చెప్పాడు.మన దేశంలో కూడా దెయ్యం ప్రేతాత్మలు  ఉన్నాయి అని తమ కుటుంబంపై మమకారం ప్రేమ చంపుకోలేక ఆపరిసరాల్లో తిరుగుతూనే ఉంటాయి అని ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు. ఇలా భయపెట్టి డబ్బు గుంజే మోసగాళ్ళు న్నారు.శాస్త్రవేత్తలు మాత్రం  జోంబీలు అనేది కట్టుకథ అని కొట్టి పారేశారు. 🌹

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం