ఆకట్టుకున్న వింజమూరి సంకీర్త్ అష్టావధానం

 ఆస్ట్రేలియా కు చెందిన తటవర్తి గురుకులం గురువు " అవధానార్చన భారతి "బ్రహ్మశ్రీ తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి" ఆధ్వర్యలో చి. వింజమూరి సంకీర్త్ ప్రథమ అష్టావధానం తేది 12-10-2024, శనివారం విజయదశమి రోజున జూమ్ వేదికగా జరిగింది. నల్లగొండ జిల్లా, చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలోని  శ్రీ శివ - ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణం నుండి పాల్గొన్న ఈ అవధానం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటిగంట కు ప్రారంభమైన ఈ అష్టావధానం సాయంత్రం ఐదు గంటల వరకు అంతర్జాల వేదికగా కొనసాగింది. హైదరాబాద్ అమీర్పేట లో ఉంటూ ఎనిమిదవ తరగతి చదువుతున్న పదమూడేళ్ళ చి. సంకీర్త్ అవధానానికి సంకీర్త్ పద్యగురువు, ఆస్ట్రేలియా లోని తటవర్తి గురుకులం గురువు, అవధాని తటవర్తి శ్రీ కళ్యాణ్ చక్రవర్తి సంచాలకులుగా వ్యవహరించారు. అవధానం లో  "భీముడు జంపె రావణుని భీకర లీల మహేగ్ర తేజుడై" అని బృందావనం రమణ కుమార్ ఇచ్చిన సమస్యకు  బాలావధాని "క్షేమము గూర్చగా ధరకి శ్రీయుత రూపము నెత్తె భూతలిన్ 
ధామముగాను వెల్గు వరదాయకుడై రణధీరయోగియై
స్వామిగ లోక రక్షణ కు సంతసమొంద రణాన రాముడే 
భీముడు జంపె రావణుని భీకర లీల మహేగ్ర తేజుడై
అని చక్కగా పూరించారు బాలావధాని సంకీర్త్. డా. సురేశ్ బాబు దత్తపది అంశంలో "కరి వరి మరి తరి" పదాలు ఇచ్చి అమ్మవారిని వర్ణించమని అడగగా "దేవి శ్రీకరి శాంకరి దివ్యవాణి
నీదు సేవను తరియించి విత్యముగను 
లోకమును గావ రిపులను రూపుమాపి
కావుమమ్మ ధరన్ మరి కరుణ జూపి అంటూ పూరించాడు. కృష్ణవంశీ పాలకొల్లు వర్ణన అంశంలో ఉయ్యాల సేవ వర్ణన అడుగగా "వెంకటాచలమని వేంకటేశుని గొల్చి , ఊయలూపుచుండ హాయిగాను, భక్తులకు వరముగ భవ్య స్వరూవమై, వెలసినట్టి దేవ వినయ నుతులు" అంటూ చక్కగా వర్ణించారు. అష్టావధాని డా. బోరెల్లి హర్ష నిషిద్ధాక్షరి అంశం సరస్వతీ వర్ణన చక్కగా సాగింది, శ్రీశాభ్దీ వాగ్భావా, ఈశామణి నీల వేద్యవే కవి నవధీ, శ్రీశారద నినుగొల్తును, దేశమ్మున విద్యనొసగి దీవెనలిడుమా అంటూ నిషిద్ధాలను అధికమించి ఎంతో అనుభవమున్న అవధానిగా చక్కని పద్యాన్ని పూరించి అందరి అభినందనలు చూరగొన్నాడు. న్యస్తాక్షరి లో డా. వేంకట సీతారామ దీక్షితులు ఒకటవ పాదంలో మొదటి అక్షరం శ, 2వ పాదంలో 2వ అక్షరం మ,   3వ పాదంలో 11వ అక్షరం సా, 4వ పాదంలో 19వ అక్షరం పా వచ్చే విధంగా దుర్గాపూజ ను వర్ణించమని అడుగగా "శమియగు నీ స్వరూపము సుశక్తినొసంగగ దివ్య మాతవై 
గమనము దెల్పుచున్ సుమతి కామితదాయిని సింహవాహిని
సమత వహించుదేవతగ సారమునిచ్చుచు మమ్ముగావవే
మమతయె  పొంగగా ధరణు మానితమూర్తి ముదంబు పాడెనే అంటూ పూరించాడమే కాకుండా ధారతో కూడిన ధారణ చేసి అందరి మనసులను ఆకట్టుకున్నాడు. వీటితో పాటు పాలూరి వెంకటరాజు అడిగిన ఆశువు, కుమారి ఆరేటి నిత్యశ్రీ, చి. ముక్తేశ్వర్ ఆరేటి లు ఇచ్చిన చిత్రాలకు పద్యం చెప్పడంతో పాటు మద్యమద్యలో అవధాని ఏకాగ్రతకు భంగం కలిగించేలా డా. రాయవరం రఘునందన్ అప్రస్తుత ప్రసంగం లో పలు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా జూమ్ ద్వారా శతావధాని ఆముదాల మురళి, నా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గోగులపాటి కృష్ణమోహన్, సురేంద్ర నాధ్, ఉషా శ్రీధర్ (యు‌. ఎస్.) వడుగురు మూర్తి ప్రభృతులు పాల్గొని అవధాని కి అభినంధన పూర్వక ఆశీర్వచనం అందజేశారు. ఈ కార్యక్రమంలో వింజమూరి సంకీర్త్ తాతయ్య నానమ్మ లు వింజమూరి నర్సింహమూర్తి, హేమలత, తల్లిదండ్రులు తేజు, భార్గవ్ లతో పాటు కుటుంబ సభ్యులు వింజమూరి రామన్న, కృష్ణమూర్తి, నాగన్న, కిరణ్, మురళి తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం