అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు. వారు ఎప్పుడు కలసి మెలసి ఉండేవారు. ఆ ముగ్గురి పేర్లు సోను, చీకు, బంటి ఒకరోజు వీరిలో సోనుకు ఒక ఆపద వచ్చింది. అది ఏమిటంటే ఆ ముగ్గురు ఒకరోజు అనంతసాగర్ గ్రామంలోని సరస్వతి దేవాలయానికి వెళ్లారు. అక్కడ జాతర జరుగుతుంది. సోను జ్యూస్ తెచ్చుకుంటాను అని చెప్పి వెళ్ళాడు. అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. జ్యూస్ తెచ్చుకోవడానికి వెళ్లిన సోను ఇంకా రాలేదు. రెండు గంటలు అయింది. అయినా అయినా కూడా ఇంకా రాలేదు. చీకు బంటి చాలా కంగారు పడ్డారు. ఎక్కడికి వెళ్ళాడో అని చీకు బంటితో సోను జాడ కోసం వెతుకుదామని అడిగాడు. కానీ బంటి సహకరించకుండా ఇంటికి వెళ్లిపోయాడు. కానీ చీకు తన మిత్రుడు సోనుని వెతకడానికి వెళ్ళాడు. అన్నిచోట్ల వెతికాడు. చివరకు సత్రంలోకి వెళ్లాడు. అక్కడ సోను కనిపించాడు. చీకు చాలా సంతోషముతో సోను దగ్గరికి వెళ్లి సోనుని తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత ఇద్దరూ సంతోషంగా జ్యూస్ తాగి ఇంటికి వచ్చారు
నీతి ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు
నీతి ఆపదలో ఆదుకున్న వాడే నిజమైన మిత్రుడు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి