మరింత భద్రత ప్రమాణాలతో విద్యుత్ వాహనాల తయారీ:- సి.హెచ్.ప్రతాప్

 శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్న్యాయ వనరులను అభివృద్ధి చేయాలన్న పారిస్ తదితర పర్యావరణ శిఖరాగ్ర సమావేశాలలో నిర్ణయించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా సంప్రదాయ పెట్రోల్, డీజల్ పై నడిచే వాహనలకు మారుగా విద్యుత్ వాహనాలను కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో భారీగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. మహీంద్రా, బజాజ్  తదితర దిగ్గజాలు విద్యుత్ వాహనాల తయారీపై దృష్టి పెట్టి వాటి కోసం విదేశీ కంపెనీలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాయి. విద్యుత్ బస్సులు, జీపులు ఇప్పుడిప్పుడే వాడకంలోకి వస్తున్నాయి. అయితే విధ్యుత్ స్కూటర్లు మాత్రం ఒక ప్రహసనంగా మారింది. వీటిలో 95 శాతం వాడుకలో అధ్వాహనం గా వున్నాయి.    దేశవ్యాప్తంగా చాలా చోట్ల విద్యుత్ స్కూటర్లు తగులబడిపోవడమో, బ్యాటరీలు పేలిపోవడమో వరుసపెట్టి జరుగుతున్న నేపథ్యంలో ఈవీ కంపెనీలు కూడా రంగంలోకి దిగాయి. కొన్ని వాహన తయారీ సంస్థలు మార్కెట్ నుంచి వాహనాలను ఉపసంహరించుకున్నాయి. ఈవీల భద్రత, నాణ్యతలను పరిశీలించేందుకంటూ ప్రభుత్వం ఇటీవల నిపుణుల కమిటీని నియమించింది ఈ చర్యలు ఉపశమనాన్నిచ్చేవే కానీ, పరిష్కారం కాదు. ప్రజల్లో ఈవీల పట్ల భయం హెచ్చితే వాటివైపు కన్నెత్తిచూడడానికి కూడా ఇష్టపడరుఅని ప్రభుత్వం త్వరగా గ్రహించాలి. దేశ ఆటోమొబైల్ పరిశ్రమ ఉత్పత్తిచేసే మొత్తం వాహనాలతో పోల్చితే రోడ్లమీద తిరుగుతున్న ఈవీల సంఖ్య అతిస్వల్పమే. కానీ, బ్యాటరీ ఖరీదు పడిపోవడం, ప్రభుత్వాలు ఈవీలకు రాయితీలు, మినహాయింపులూ ఇస్తుండటంతో వాటిపై మోజు పెరుగుతున్నది అయితే సరైన డిజైనింగ్ లేకుండా,భద్రత పట్ల నిర్ధిష్ట ప్రమాణాలను పాటించకుండా తయారీ సంస్థలు ఇష్టారాజ్యంగా వాటిని తయారు చేసేస్తున్నాయి.  అంతే కాకుండా విద్యుత్ బ్యాటరీల ధర తగ్గిపోవడం, ప్రభుత్వాలు విద్యుత్ వాహనాల తయారీ సంస్థలకు, వినియోగదారులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించడం, విదేశాల నుండి దిగుమతి అయ్యే బ్యాటరీల నాణ్యతపై ఎలాంటి నిఘా, నియంత్రణలు లెకపోవడం ప్రస్తుత దుస్థితికి ప్రధాన కారణాలు.2024 సంవసరం కల్ల దేశంలో  బ్యాటరీల విషయంలో స్వయం సమృద్ధిని సాధిస్తామని నిరుడు ఘనంగా ప్రకటించుకున్న ప్రభుత్వం ఆ దిశగా ఖచ్హితమైన ప్రణాళికలను ఇంకా అమలు చెయ్యలేదు.భారత్ లో ఉష్ణ వాతావరణానికి సరిపోయే ప్రత్యేక డిజైనింగు ను అమలు చేయాలనుకున్న  అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాల సంస్థ ఇటీవలె తన నివేదికలో తెలియజేసింది.  భారీ జరిమానాలతో కంపెనీలను శిక్షించడం కంటే, ఒక శాశ్వత వ్యవస్థతో ఈవీ కంపెనీల సమస్త కార్యకలాపాలను నియంత్రించడం అవసరం. విద్యుత్ వాహనాల విషయంలో వినియోగదారులకు ప్రత్యేక అవగహన కుడా కల్పించాలి.విధ్యుత్ వాహనాలకు ప్రజల నుండి మెరుగైన స్పందన రావాలంటే పార్కింగ్, చార్జింగ్ వంటి వంటి సౌకర్యాలను ఉచితంగా కల్పించాలి. ఐ ఐ టి వంటి ఉన్నత సంస్థలలో విద్యుత్ వాహనల డిజైనింగ్,కావల్సిన భద్రతా ప్రమణాలపై విసృతంగా పరిశోధనలు జరగాలి. ఫ్యాక్తరీ స్థాయిలోనే పూర్తి స్థాయి భద్రతా తనిఖీలు  జరపాలి.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం