91.ఏనాడు సమాజాన, సద్గుణవంతులు లేకుండాలేరే!వందకౌరవుల కాలం ,ఐదుగురు పాండవులున్నారే!రాక్షసుల సైతం బలి, ప్రహ్లాదులు మార్గమే చూపారే!కలియుగం ఒక్క నాయకుడు ,చాలే జనం నడుస్తారే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!92.ధనం లేదనద్దు దాతలే, స్వచ్ఛందంగా ముందుకొస్తారే!ధనవంతుల కొందరైనా, గుణవంతులై తీరుతారే!ధనగుణవంతులు,ఆర్తులకు ఆసరా అవుతారే!వారే చేయూతనివ్వ ,అర్హులు ఘన భవిత కాంచరే!ఆవేదనే నివేదన ఆలకించు,మా సింహాచలేశా!93.సామాన్యులే,మేముసైతమంటూ ,చిరు సాయం అందిస్తారే!బిందువులు కలిస్తే సింధువే,రూకలు కోట్లు చేస్తారే!దారిద్ర్య నివారణే దేహాన,స్వేదధార స్రవిస్తారే!చింతవీడి, ప్రతినపూని,సరి లక్ష్యమే సాధిస్తారే!ఆవేదనే నివేదన ఆలకించు, మా సింహాచలేశా!_________
ఆవేదనే నివేదన:- డా పివిఎల్ సుబ్బారావు,-9442058797.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి