శ్రీరామ కథ భక్తులకుఎప్పటికీ ఆపాతమధురమే !రామాయణంలోసీతారాముల కాల్యాణంకమనీయ రమణీయ ఘట్టం.ఆ కాల్యాణముకై జనకుడు విధించినశివ ధనుర్భంగము చేసిసీతను చేపట్టాలి....రాజులు ఒక్కొక్కరు వస్తున్నారు.....తమ శక్తి సామర్థ్యాలనుప్రదర్శించి వెళ్తున్నారు.శివ ధనస్సును విరిచేంతటిపరాక్రమం వారిలో లోపించింది.ధనస్సును ఎత్తడానికే ఆపసోపాలు పడుతున్నారుఓరకంటగా....సీతమ్మ వైపుశ్రీరాముడు చూస్తున్నాడు...రామయ్య వంతు......రానే వచ్చింది.శివ ధనస్సును ఒక్క ఉదుటనలేపి...వంచాడు.రామయ్య పై పూల వర్షం కురిసింది.సిగ్గులోలుకుతున్న సీతమ్మకుపరిణయ మాడటానికివేదికగా నిలిచింది.సీతమ్మ తనకే సొంతం అన్నట్లుగా..రామయ్య విజేతగా నిలిచాడు.ఆకాశమంత పందిరి....భూమండలమంత వాకిలి....నును సిగ్గులోలుకుతున్నసీతమ్మ పెళ్లి పీటపై కూర్చుందిసీతమ్మ కంటి రామయ్యఅందంగా ముస్తాబయ్యాడు.కాల్యాణ ఘడియ రానే వచ్చింది...తన రాజ్య ప్రజలు చూస్తుండగానే....రామయ్య సీతమ్మ మెడలోమూడు... ముళ్ళు వేశాడు.ఆ దృశ్యం ఇంతవరకు.,..భువిలో చూడనిది.సీతారాముల కాల్యాణంతిలకించడానికి ముక్కోటిదేవతలు భూమికిదిగివచ్చిన క్షణమది.కాల్యామంటేసీతారాముల కాల్యాణం !వైభోగం అంటేసీతారాములదే.....!భద్రాద్రి లో జరిగే కాల్యాణంకడుకమనీయం....చూసేవారికి చూడముచ్చటపుణ్యపురుషులకు......ధన్య భాగ్యమట......సీతారాముల కాల్యాణంచూసి తరిద్దాం రారండి..!
చూడ ముచ్చట.........సీతారాముల కాల్యాణం..!:- 'సాహితీ శిరోమణి’'సాహితీ ధురీణ''వాజ్ఞ్మయ భూషణ' '' కావ్యసుధ '' 9247313488 హైదరాబాదు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి