ఒకానొకప్పుడు శ్రీకృష్ణదేవరాయలు అనే రాజు ఉండేవాడు. అతడు చాలా మంచి వాడు . ప్రజల కష్టసుఖాలను నిత్యం తెలుసుకుని పరిపాలించేవాడు. ఒక రోజు రాయలవారు నిద్రలో కలగన్నాడు. ఆ కలలో ఆయనకు ఒక అందమైన భవనం కనిపించింది. ఆ భవనం ఆకాశంలో తేలుతూ లక్ష దీపాలతో చాలా అద్భుతంగా ఉంది. ఆ భవనాన్ని కలలో చూసిన రాయలవారు ఆ కలను మరువలేకపోయారు. మరుసటి రోజు సభలో ఆయన కలను వివరించి దాన్ని నిజం చేయాలని తెలిపారు. అది విన్న వారంతా అలాంటి భవనాన్ని ఎలా కట్టగలము? అసలు గాలిలో తేలుతున్న భవనాన్ని కట్టడం అసాధ్యం అని రాయలకు నచ్చ చెప్పారు. కానీ రాయలు కోపగించుకుని " అదంతా నాకు అనవసరం. మీరేం చేస్తారో నాకు తెలియదు, నా కల నిజమవ్వాలి. అలాంటి భవనాన్ని కట్టిన వారికి లక్ష వరహాల బహుమానం ఇస్తాను " అని ప్రకటించి ఆ కళ నిజమయ్యేదాకా నాకు కనిపించకండి అని ఆజ్ఞాపించారు. అది విన్న వారంతా నిర్గాంత పోయారు. రోజులు గడిచినా రాయలు మాత్రం ఆ కలను మరువలేదు. ఆస్థానంలోని పండితులకు ఏమి చేయాలో తోచడం లేదు.
ఇదిలా ఉండగా ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు నెరసి పోయిన గడ్డం, జుట్టు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. " నాకు అన్యాయం జరిగింది మహాప్రభో! మీరే నాకు న్యాయం చేయాలి "అంటూ రాయలవారిని ఆ వృద్ధుడు ప్రార్థించాడు. " నీకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పు. నేను న్యాయం చేస్తాను" అని రాయలు హామీ ఇచ్చాడు.
"నా దగ్గర నూరు వరహాలు ఉండేవి స్వామి. ఒకరు దొంగలించక పోయారు. నాకు ఆ దొంగ ఎవరో తెలుసు. నా వరహాలు నాకు ఇప్పించండి " అని ఆ వృద్ధుడు విన్నవించాడు. శ్రద్ధగా విన్న రాయలు 'ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చేశారు " అని ప్రశ్నించారు.
అప్పుడు వృద్ధుడు తడపడడం చూసి, "నీకేం భయం లేదు, నిర్భయంగా నాతో చెప్పు" అని రాయలు ధైర్యం ఇచ్చాడు. 'నా నూరు వరహాలు దొంగిలించింది మీరే స్వామి ' అని అన్నాడు వృద్ధుడు. "నిన్న రాత్రి నా కళ్ళలో వచ్చి మీరే కదా స్వామి అవి దోచారు" అని అన్నాడు. వెంటనే రాయల వారికి చాలా కోపం వచ్చింది. " ఏమిటి నీ వెటకారం..? వేలా కోలంగా ఉందా ? " కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా? అని కోపంగా అడిగారు. ఈ మాటలు విన్న వృద్ధుడు వెంటనే తన గెడ్డం, మీసం, కర్రను పక్కకు పడేసి మారువేశాన్ని విప్పాడు. చూస్తే అతను ఆస్థానంలో ఉండే తెనాలి రామకృష్ణుడు.
" క్షమించండి స్వామి! మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేశాను " అన్నాడు తెలివిగా తెనాలి రామకృష్ణుడు. రామకృష్ణుని మాటలకు రాయలవారు బిగ్గరగా నవ్వాడు. తనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను రాయలవారు ఘనంగా అభినందించి సత్కరించారు.
ఇదిలా ఉండగా ఒకరోజు సభకు ఒక వృద్ధుడు వచ్చాడు నెరసి పోయిన గడ్డం, జుట్టు, మీసాలతో పాపం అతి కష్టం మీద కర్రతో నడుస్తున్నాడు. " నాకు అన్యాయం జరిగింది మహాప్రభో! మీరే నాకు న్యాయం చేయాలి "అంటూ రాయలవారిని ఆ వృద్ధుడు ప్రార్థించాడు. " నీకు ఏమి అన్యాయం జరిగిందో చెప్పు. నేను న్యాయం చేస్తాను" అని రాయలు హామీ ఇచ్చాడు.
"నా దగ్గర నూరు వరహాలు ఉండేవి స్వామి. ఒకరు దొంగలించక పోయారు. నాకు ఆ దొంగ ఎవరో తెలుసు. నా వరహాలు నాకు ఇప్పించండి " అని ఆ వృద్ధుడు విన్నవించాడు. శ్రద్ధగా విన్న రాయలు 'ఈ దొంగతనం ఎవరు చేశారు ఎక్కడ చేశారు " అని ప్రశ్నించారు.
అప్పుడు వృద్ధుడు తడపడడం చూసి, "నీకేం భయం లేదు, నిర్భయంగా నాతో చెప్పు" అని రాయలు ధైర్యం ఇచ్చాడు. 'నా నూరు వరహాలు దొంగిలించింది మీరే స్వామి ' అని అన్నాడు వృద్ధుడు. "నిన్న రాత్రి నా కళ్ళలో వచ్చి మీరే కదా స్వామి అవి దోచారు" అని అన్నాడు. వెంటనే రాయల వారికి చాలా కోపం వచ్చింది. " ఏమిటి నీ వెటకారం..? వేలా కోలంగా ఉందా ? " కలలో జరిగింది నిజమనుకుంటే ఎలా? అని కోపంగా అడిగారు. ఈ మాటలు విన్న వృద్ధుడు వెంటనే తన గెడ్డం, మీసం, కర్రను పక్కకు పడేసి మారువేశాన్ని విప్పాడు. చూస్తే అతను ఆస్థానంలో ఉండే తెనాలి రామకృష్ణుడు.
" క్షమించండి స్వామి! మీ కలను నిజం చేయడం ఎంత కష్టమో నిరూపించడానికి ఇలా చేశాను " అన్నాడు తెలివిగా తెనాలి రామకృష్ణుడు. రామకృష్ణుని మాటలకు రాయలవారు బిగ్గరగా నవ్వాడు. తనకు అర్థమయ్యేలా చెప్పిన తెనాలి రామకృష్ణను రాయలవారు ఘనంగా అభినందించి సత్కరించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి