జాతీయ స్థాయిలో ప్రతినెల ప్రముఖ సాహితీ సంస్థ కవితాలయం నిర్వహిస్తున్న కథల పోటీలలో "పలచబడుతున్న నేటి దాంపత్య బంధం"అనే అంశం పై జరిగిన కథల పోటీలలో కవి, రచయిత సాహిత్యరత్న ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం వ్రాసిన" అవగాహనే ఆదర్శదాంపత్య బంధానికి ప్రతీక"అనే కథను స్వీకరించి సంస్థ అధ్యక్షురాలు కవియత్రి,డాక్టర్ కోదాటి అరుణగారు, ప్రముఖ రచయిత్రి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నాయని కృష్ణకుమారి(కృష్ణక్క) గారు ,సాహితీ విశ్లేషకులు కవి డాక్టర్ నాయకంటి నృసింహ శర్మ గారు ప్రథమ విజేతగా అభినందనలు తెలియచేసారు. బదులుగా కవి ప్రసాద్ నేను అభిమానించే డాక్టర్ కృష్ణక్క అశీస్సులతో ఇచ్చిన ఈ అభినందన ప్రశంసా పత్రం మరువలేనిదని జీవితంలో దాంపత్య బంధం అతి పవితమైనదని నేటి సమాజంలో అవగాహన లోపంవల్లే భార్య భర్త లు విడిపోతున్నారని అవగాహన ఉంటే దాంపత్య బంధం సుఖ ప్రదమని ముఖ్యంగా ఈ నాటి యువత గ్రహించాలని అన్నారు
సాహితీ మిత్రులు, శ్రేయోభిలాషులు అయ్యలసోమయాజులకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుయచేసారు..!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి