ఊషన్నపల్లి పాఠశాలకు ఎఫ్ఎల్ఎన్ ఛాంపియన్ స్కూల్ అవార్డు
 -పిల్లల ప్రతిభ ఆధారంగా ఎంపిక 
-ఉపాధ్యాయుల కృషితో ఫలితాల సాధన 
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం  ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (స్వయం అభ్యసన కేంద్రం) 'ఎఫ్ఎల్ఎన్ ఛాంపియన్ స్కూల్ అవార్డుకు' ఎంపికైంది. ఊషన్నపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు సురేష్ కుమార్ లు మంగళవారం పెద్దపల్లి జిల్లా విద్యాశాాధికారి డి. మాధవి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. పాఠశాలలోని పిల్లలు తెలుగు, ఆంగ్లం భాషాంశాలను అనర్గళంగా చదవడంతో పాటు గణిత చతుర్విధ ప్రక్రియల్లో ప్రతిభ కనబరిచినందుకు గాను ఊషన్నపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఈ అవార్డు వచ్చింది. గతంలో ఎఫ్ఎల్ఎన్ లో పాఠశాల పిల్లలు అత్యంత ప్రతిభ కనబరిచినందుకు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా 'బెస్ట్ స్కూల్ అవార్డు' అందుకున్నారు. ఇప్పుడు 2024 -2025 విద్యా సంవత్సరానికి గాను ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు 'ఎఫ్ఎల్ఎన్ ఛాంపియన్ స్కూల్ అవార్డు' రావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు సురేష్ కుమార్, స్కూల్ చైర్మన్ పెండ్లి స్వరూప, పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, మండల విద్యాధికారి సిరిమల్ల మహేష్, కాంప్లెక్స్ హెచ్.ఎం. నరెడ్ల సునీత, మండలంలోని అధికారులు, ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.

కామెంట్‌లు