మానవత్వం : - ఋష్యశృంగు ఢిల్లేశ్వరరావు-సారవకోట
మానవత్వము చూపని మతములేలా?
దండించమని చెప్పే దైవమేలా?

ఇస్లాం ఇతరులకు ఇబ్బంది పెట్టమని
ముస్లిములు మర్డర్ చేయమని
క్రైస్తవం కనికరం చూపకూడదని 
క్రైస్తవులు క్రైమ్ చేయమని
హిందూ మతం హింసించమని 
హైందవులు హత్యలు చేయమని
మతాలు మారణ హోమం చేయమని చెబుతాయా..
మానవత్వముతో మెలగమని,
మంచి చేయమనే చెబుతాయి.
అలా చేయనివారు మనుషులే కాదు నర రూప రాక్షసులు..

భరతమాత తలకు కిరీటంలా ఉన్న కాశ్మీరు.. 
మంచందాలతో, సెలయేరులు,  సరస్సుల సోయగాలతో ఆకర్షించి ప్రసిద్ధి గాంచిన కాశ్మీరం..

ఎర్రని ఆపిల్స్, స్ట్రాబెర్రీ, కుంకుమపువ్వుతో ఇదివరకు సందర్శకులకు కనువిందు చేస్తే.. 

నిన్న పహాల్గామే కాదు  నేడు, రేపు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రంలోని ఏ  ప్రాంతంలో ముస్లిమేతరులు కాలు మోపినా కాలయముడి పిలుపు వచ్చినట్టేలా ఉంది. మతోన్మాదులు మారణాయుధాలతో, ఉగ్రవాదులు ఊచకోతలతో, పర్యాటకుల ప్రాణాలు తీసే ప్రాంతాలుగా తయారయ్యాయి.

మతం కోసం మానవత్వం మరచిన మతోన్మాదులు సిపాయి దుస్తుల్లో వచ్చి కసాయిగా కసితో, కర్కశంగా హితం చేసే హిందువులు ప్రాధేయపడినా, వేడుకున్నా వదలక వారి ప్రాణాలను అన్యాయంగా, అమానుషంగా, అతికిరాతకంగా వారి కుటుంబ సభ్యుల ఎదురుగా  చంపి తీసేస్తే అక్కడ "మృతదేహాల నుండి రక్తపుటేరులు పారి ఎరుపెక్కాయి.."
అవి చూసిన కుటుంబ సభ్యుల గుండెలు బరువెక్కాయి.. వారి కళ్ళు ఎరుపెక్కాయి..  హతమార్చిన వార్ని ఏమీ చేయలేని నిస్సహాయంగా నిలిచాయి.

ప్రజల ప్రాణాలు తీసిన  ప్రాణాంతకుల్ని, ప్రభుత్వాలు వెంటనే పట్టుకోవాలి. కఠినాతి కఠినంగా శిక్షించాలి. మరణ శిక్ష వేయాలి. ఇటువంటి దురాగతాలు ఇక ముందు జరగకుండా చూడాలి.


కామెంట్‌లు