కావ్యం విశ్వ శ్రేయం అని, సాహిత్య మనేది ప్రపంచ శ్రేయస్సును కోరుకునేదని, కొత్తూరు రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ సాహితీవేత్త, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు అన్నారు.
మండల కేంద్రంలో గల సత్యసాయి మందిరం ఆవరణలో కొత్తూరు రచయితల వేదికను స్థాపించి ఆయన ప్రారంభించారు. ఈ కొరవే ఆవిర్భావ సమావేశానికి అధ్యక్షత వహించిన తిరుమలరావు మాట్లాడుతూ సమాజానికి సందేశం సంకేతం ఈ కవిత్వమని అన్నారు. ప్రజలను చైతన్యపరిచే ఒక శక్తివంతమైన ప్రేరణం ఈ కవనమని, సామాజిక స్పృహ కలిగించే ఒక మాధ్యమం ఈ రచనలని అన్నారు. తొలుత కుదమ తిరుమలరావు నారికేళం సమర్పించి ఆవిర్భావ పూజచేసి ప్రారంభించగా, వేదమంత్ర పఠన శ్లోకాలను మావుడూరి మురళీకృష్ణ పఠించారు. అమ్మల కామేశ్వరి జ్యోతి ప్రజ్వలన గావించగా, భరతమాత చిత్ర పటానికి కలమట శ్రీరాములు పూలమాలను వేసి నేటి కార్యక్రమాలను ప్రారంభించారు. కొరవే లోగో ను కుదమ తిరుమలరావు రూపొందించగా, ఆ లోగో ను డా.యెన్ను అప్పలనాయుడు ఆవిష్కరించారు.విశ్వ శాంతి, సామాజిక బాధ్యత, భాషాపోషణలనేవి కొరవే లోగో పరమార్థమని, వీటికోసం చిత్తశుద్ధితో కొరవే కృషి చేస్తుందనేది లోగో చిత్ర భావమని వివరించారు.
తదుపరి హాజరైన కవులతో కవి సమ్మేళనం నిర్వహించడమైనది. కుదమ తిరుమలరావు సంక్షేమం, మావుడూరి మురళీకృష్ణ కాలమానేర్చుకో, డా.యెన్ను అప్పలనాయుడు మనభాషకు వన్నె కూర్చు, పల్ల నారాయణరావు విహంగాల గమన తీరు, పెదకోట ధనుంజయరావు చెట్లు ప్రగతికి మెట్లు, బూరాడ గణేష్ మతం సమ్మతం, కలమట శ్రీరాములు తెలుగు నేల, అమ్మల కామేశ్వరి నా తెలుగు, గడసాపు ఉషారాణి కొత్తూరు రచయితల వేదిక అనే అంశాలపై కవితలను వినిపించారు.
కవులందరినీ అభినందిస్తూ శాలువాలతో ఘనసన్మానాలు జరిగాయి. అనంతరం తదుపరి కార్యాచరణ ప్రణాళికలకు భ్యులంతా వ్యూహరచన గావించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి