చదువుతో పాటు సంస్కారాన్ని అలవర్చుకోవాలని, మానవతా విలువలతో కూడిన విద్యను విద్యార్థులంతా సాధించాలని పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు అన్నారు.
పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో తమ పాఠశాల నుండి ఎన్ ఎం ఎం ఎస్ కు ఎంపికైన పతివాడ హరిణి తమకెంతో గర్వకారణంగా నిలిచిందని అన్నారు. అలాగే మండల స్థాయిలో నిర్వహించిన సైన్స్ ఫేర్ లో తమ పాఠశాల రూపొందించిన బయోగ్యాస్ ప్రోజెక్ట్ ప్రథమ స్థానంలో నిలిచిందని అన్నారు. తమ పాఠశాల విద్యార్థులు మండల స్థాయి గణిత, సైన్స్ పోటీలలో కన్సోలేషన్, ద్వితీయ బహుమతులను గెలుపొందినట్లు, మరియు స్కూల్ కాంప్లెక్స్ స్థాయి స్వర్ణాంధ్ర-2047 వక్తృత్వంలో ప్రథమ స్థానంలో నిలిచినట్లు కృష్ణారావు గుర్తుచేసారు.
ఇదే వేదికపై ఎనిమిదో తరగతి బాలబాలికలైన 14మందికి వీడ్కోలు పలుకుతూ సర్పంచ్ ఎద్దు చామంతమ్మ, ఉప సర్పంచ్ డోల చిన్నారావు, విశ్రాంత వీఆర్వో బలగ అప్పారావునాయుడు, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత పారశెల్లి రామరాజు, స్థానిక యువ నేత ఎద్దు సంతోష్ కుమార్ ల చేతులమీదుగా జ్ఞాపికలను బహూకరించారు. అలాగే ఉపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్ నిర్వహించిన సైన్స్ క్విజ్ పోటీల్లో విజేతలైన 20మంది విద్యార్థులకు జ్ఞాపికలను, మెడల్స్ ను పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ బలగ రజని చేతులమీదుగా అందజేసారు.
పాఠశాల విద్యార్థులలో ఉత్తమ విద్యార్థులుగా నిలిచిన డోల దిలీప్, బెహరా ప్రవళ్ళికలకు, నృత్యాలందు ప్రతిభ చూపిన వంబరవిల్లి జగదీష్ లకు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు చేతులమీదుగా షీల్డ్ లను బహూకరించారు. తెలుగు ఉపాధ్యాయులు బూడిద సంతోష్ కుమార్ స్వాగతవచనములు పల్కగా,
ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు ప్రార్ధనాగీతాన్ని ఆలపించిరి.
జ్యోతి ప్రజ్వలన హిందీ ఉపాధ్యాయని యిసై సౌజన్యవతి, ఉపాధ్యాయులు పైసక్కి చంద్రశేఖరం భారతమాత చిత్ర పటానికి పూలమాలాలంకరణ గావించారు.
అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన 25 సందేశాత్మక, ఆద్యాత్మిక, వినోదాత్మక, జానపద నృత్యరూపకాలు, 6 సందేశాత్మక నాటికలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. పూర్వ విద్యార్ధులు సైతం ప్రదర్శనలు ఇచ్చి అందరి ప్రశంసలు పొందారు. ఇందులో ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, బూడిద సంతోష్ కుమార్, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు విద్యార్థులతో పాటు ఒక్కో పాటకు నృత్యప్రదర్శన, సందేశమీయుట ప్రేక్షకుల అభినందనలు పొందాయి.
నృత్య ప్రదర్శనల మధ్యలో ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, అందవరపు రాజేష్ లు ప్రత్యేక గీతాలను ఆలపించారు. తొలుత పాఠశాల ఆధ్వర్యంలో పూర్వ ఉపాధ్యాయులైన జి.సింహాచలం, బాల ప్రసాద్, ఎం.రమణయ్య, బట్ట గణేష్, జి.లక్ష్మీనారాయణ, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్మన్ బలగ రజని, మాజీ ఛైర్మన్ కొర్లాన సురేష్, ఉపాధ్యాయ సంఘ నేతలు బూడిద వీరభద్రయ్య, ఎం.శాంతారాం, వి.మధుసూదన్, బూరాడ గణేష్, మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులైన ఔదులమ్మ, తవిటమ్మ, మీనాలకు, పాఠశాల ఆయా సరస్వతి తదితరులకు ఘనంగా సన్మానించారు. అనంతరం
ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులను విద్యార్థులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి