పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లిలోని ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (స్వయం అభ్యసన కేంద్రం)లో బుధవారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ (పిటిఎం) పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలో చేబట్టబోయే కార్యక్రమాలపై చర్చించి, ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. అనంతరం పాఠశాలలో నాలుగో తరగతి చదువుతున్న వంగ మేఘనకు గురుకుల పాఠశాలలో సీటు రావడం పట్ల పాఠశాల సిబ్బందితో పాటు గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు, ఎంఈఓ సిరిమల్ల మహేష్, సిహెచ్చెం నరెడ్ల సునీత, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు, పలువురు ఆనందం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ప్రతిభ కనబరిచిన వంగ మేఘనకు ఒక ఇంగ్లీష్, తెలుగు డిక్షనరీ, ప్రశంసా పత్రం అందజేస్తూ ఆమెను అభినందించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయని, పాఠశాలల అభివృద్ధిలో గ్రామస్తులు, తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందన్నారు. ఊషన్నపల్లి పాఠశాలలో సకల సౌకర్యాలు కల్పించామని, ఉచిత నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల
సమ్మయ్య, ఎఎపిసి ఛైర్ పర్సన్ పెండ్లి స్వరూప, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, కొంకటి శ్రీవాణి, పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు, పలువురు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి