ఒకానొక శిష్యుడు గురువుని అడిగాడు
"గురువుగారూ! నేను ఖర్జూరం పండ్లు తింటే మీతో నియమాలను అతిక్రమించిన వాడినవుతానా?"
"అలా ఏమీ లేదే. ఏ అనుమానాలూ లేకుండా తినొచ్చు" చెప్పారు గురువు.
వెంటనే శిష్యుడు "వాటితోపాటు ఈస్ట్ కలిపితే తప్పా?" అని అడిగాడు.
"అందులో తప్పేమీ లేదే. తినైచ్చు" అన్నారు గురువు.
మళ్ళీ శిష్యుడడిగాడు...
"వాటితోపాటు కొంచెం నీరు సేవిస్తే..." అని తనకున్న సందేహాన్ని అడిగాడు శిష్యుడు.
"ఒక్క తప్పూ లేదు" అన్నారు గురువు.
ఆయన మరేదో చెప్పబోయే లోపు శిష్యుడు అడ్డుపడుతూ, ఈ మూడింటినీ కలిపే ఖర్జూర పండు మధువు తయారు చేస్తున్నారు. మరి దానిని మాత్రం సేవించికూడదని ఎందుకంటున్నారో తెలీడం లేదు" అన్నాడు.
గురువుగారు అడిగారు "ఓ పిడికెడు మట్టి తీసి నీ తలమీద పోస్తే నీకు నొప్పేస్తుందా?"
"నొప్పెట్టదు" చెప్పాడు శిష్యుడు.
"దాని మీద ఓ గ్లాసు నీరు పోస్తే..." అని అడిగారు గురువు.
"అప్పుడూ ఏమీ అవదు" అన్నాడు శిష్యుడు.
గురువు గారు "ఈ రెండింటినీ సమపాళ్ళలో కలిపి కాల్చి ఇటుక చేసి నీ తలమీద బలంగా కొడితే ఏమవుతుంది" అని అడిగారు.
"నా తల బద్దలవుతుంది" అన్నాడు శిష్యుడు.
"నువ్వు మొదటడిగిన ప్రశ్నకు జవాబు తెలిసి ఉంటుందనుకుంటాను" అన్నారు గురువుగారు.
"అవును, తెలిసొచ్చింది. నన్ను క్షమించండి" అని నమస్కరించాడు శిష్యుడు.
నీతి : జ్ఞానాన్ని మంచి విషయాలకు మాత్రమే ఉపయోగిస్తే సులువుగా విజయం సాధించొచ్చు.
"గురువుగారూ! నేను ఖర్జూరం పండ్లు తింటే మీతో నియమాలను అతిక్రమించిన వాడినవుతానా?"
"అలా ఏమీ లేదే. ఏ అనుమానాలూ లేకుండా తినొచ్చు" చెప్పారు గురువు.
వెంటనే శిష్యుడు "వాటితోపాటు ఈస్ట్ కలిపితే తప్పా?" అని అడిగాడు.
"అందులో తప్పేమీ లేదే. తినైచ్చు" అన్నారు గురువు.
మళ్ళీ శిష్యుడడిగాడు...
"వాటితోపాటు కొంచెం నీరు సేవిస్తే..." అని తనకున్న సందేహాన్ని అడిగాడు శిష్యుడు.
"ఒక్క తప్పూ లేదు" అన్నారు గురువు.
ఆయన మరేదో చెప్పబోయే లోపు శిష్యుడు అడ్డుపడుతూ, ఈ మూడింటినీ కలిపే ఖర్జూర పండు మధువు తయారు చేస్తున్నారు. మరి దానిని మాత్రం సేవించికూడదని ఎందుకంటున్నారో తెలీడం లేదు" అన్నాడు.
గురువుగారు అడిగారు "ఓ పిడికెడు మట్టి తీసి నీ తలమీద పోస్తే నీకు నొప్పేస్తుందా?"
"నొప్పెట్టదు" చెప్పాడు శిష్యుడు.
"దాని మీద ఓ గ్లాసు నీరు పోస్తే..." అని అడిగారు గురువు.
"అప్పుడూ ఏమీ అవదు" అన్నాడు శిష్యుడు.
గురువు గారు "ఈ రెండింటినీ సమపాళ్ళలో కలిపి కాల్చి ఇటుక చేసి నీ తలమీద బలంగా కొడితే ఏమవుతుంది" అని అడిగారు.
"నా తల బద్దలవుతుంది" అన్నాడు శిష్యుడు.
"నువ్వు మొదటడిగిన ప్రశ్నకు జవాబు తెలిసి ఉంటుందనుకుంటాను" అన్నారు గురువుగారు.
"అవును, తెలిసొచ్చింది. నన్ను క్షమించండి" అని నమస్కరించాడు శిష్యుడు.
నీతి : జ్ఞానాన్ని మంచి విషయాలకు మాత్రమే ఉపయోగిస్తే సులువుగా విజయం సాధించొచ్చు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి