తిరుమలరావు మాస్టారుకు పాఠశాల కమిటీ సన్మానం

 జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత, పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావును ఆ పాఠశాల యాజమాన్య కమిటీ ఘనంగా సన్మానించింది. 
పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో తిరుమలరావు సేవలను కొనియాడుతూ ఈ సన్మానం జరిగింది. ఎస్ ఎం సి ఛైర్ పర్సన్ బలగ రజని మాట్లాడుతూ తిరుమలరావు నిరంతర కృషి ఎందరికో ఆదర్శమని, విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించుటతో పాటు సృజనాత్మక నైపుణ్యం పెంపొందించుట మిక్కిలి అభినందనీయమని అన్నారు. 
పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు, ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, పాఠశాల యాజమాన్య కమిటీ ఛైర్ పర్సన్ బలగ రజని, ఉపసర్పంచ్ డోల చిన్నారావు, స్థానిక యువ నేత ఎద్దు సంతోష్ కుమార్ తదితరులు తిరుమలరావును శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
కామెంట్‌లు