బాల సాహిత్యోత్సవానికి రండి:- డాక్టర్ జె. చెన్నయ్య
 గత కొన్ని సంవత్సరాలుగా పద్మభూషణ్ డాక్టర్ కే ఐ వరప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలోని శాంతా- వసంతా ట్రస్టు సౌజన్యంతో తెలంగాణ సారస్వత పరిషత్తు నిర్వహిస్తున్న కోడూరు శాంతమ్మ స్మారక బాలసాహిత్యోత్సవం ఈ సంవత్సరం మే 23న హైదరాబాదులో జరగనుంది.
 బాల సాహిత్య వికాస కృషిలో పాలుపంచుకుంటున్న బాల సాహిత్య రచయితలు, బాల సాహిత్య వేత్తలు,పాఠశాల స్థాయిలో విద్యార్థులకు మార్గదర్శకులుగా ఉంటూ వారిలో సృజనాత్మక రచన పట్ల అభిరుచిని కలిగించి వారి రచనలను ముద్రణ రూపంలో వెలువరించేందుకు దోహదం చేస్తున్న ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చునని పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య  ఒక ప్రకటనలో తెలిపారు. 
బాల సాహిత్యంలో నూతనత్వం ఆవశ్యకం, బాల సాహిత్యం-జనరంజక విజ్ఞాన రచనలు, పాఠశాలల్లో బాలసాహిత్యం- ఉపాధ్యాయుల పాత్ర, బాల సాహిత్య వికాసం- రచయిత్రుల కృషి,  బాలసాహిత్యం విస్తృతి మొదలైన అంశాల్లో సదస్సులు, అభిప్రాయ వేదికలు, విశిష్ట సేవలు అందించిన వారికి సత్కారాలు మొదలైన అంశాలు ఉంటాయని పేర్కొన్నారు. 

మే 5వ తేదీలోగా తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఔత్సాహిక ఉపాధ్యాయులు, బాలసాహిత్య రచయితలు ప్రతినిధులుగా వాట్సాప్ నెంబరు 9603727234లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.

కామెంట్‌లు