ఇంటింటికీ గురువులు - చకచకా నూతన ప్రవేశాలు

 బడీడు పిల్లలను బడిలో చేర్పించే ప్రక్రియలో భాగంగా, ఇళ్లకు వెళ్లి నూతన నమోదులు గావించుచున్నామని
పాతపొన్నుటూరు ఎంపియుపి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావు తెలిపారు.
స్థానిక అంగన్వాడీ కేంద్రంలో గల పిల్లలలో ఐదేళ్లు నిండిన వారి వివరాలను అంగన్వాడీ కార్యకర్త పతివాడ కాంచనమాల నుండి సేకరించడం కూడా జరిగిందని ఆయన అన్నారు. 2025 ఆగష్టు 31 నాటికి ఐదేళ్లు పూర్తి కాగల్గు బాలబాలికలను పదిమందికి పైగా సేకరించడం జరిగిందని కృష్ణారావు తెలిపారు. వారి ఇళ్ళ వద్దకే ప్రవేశ దరఖాస్తులను తీసుకుని వెళ్ళగా ఇప్పటికి ఆరుగురు సంతకాలు చేసి తమకు అందజేసారని, వారిని పాఠశాల రికార్డుల్లో నమోదు పర్చామని ఆయన తెలిపారు.  నేటి ఈ పర్యటనలో యామల మిన్నారావు, స్వాతి దంపతులు తమ కుమార్తె యామల హిమశ్రీని ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుపై సంతకం చేయగా, లంక కృష్ణ, సుజాత దంపతులు తమ కుమార్తె లంక లోకేశ్వరిని నమోదు చేస్తూ సంతకాలు చేసారు. ఈ ఇద్దరు బాలికలతో పాటు ఇప్పటికి ఎనిమిది మంది ఒకటో తరగతిలో నమోదైనట్లు కృష్ణారావు తెలిపారు. 
మండుటెండల్ని సైతం లెక్క చేయకుండా నిర్వహిస్తున్న ఈ నమోదుల పర్యటనలో 
ప్రధానోపాధ్యాయులు గుర్రాల కృష్ణారావుతో పాటు ఉపాధ్యాయులు అందవరపు రాజేష్, పైసక్కి చంద్రశేఖరం, బూడిద సంతోష్ కుమార్, యిసై సౌజన్యవతి, బొమ్మాళి నాగేశ్వరరావు, కుదమ తిరుమలరావులు పాల్గొన్నారు.
కామెంట్‌లు