కడుమున కుదమ చేరి - కడుముచ్చటగా మూడోసారి.

 తన యథాస్థానమైన కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయులు కుదమ తిరుమలరావు తిరిగి నియామకం పొందారు. ఇలా ఆయన చేరి, ముచ్చటగా మూడోసారి. మూడు సార్లు చేరిన వైనం ఏమిటో చూద్దాం. విజయనగరం జిల్లా రాజాం మండలం, రాజాం పురపాలక సంఘం పరిధిలో గల కొత్తవలస ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా 2019లో పదోన్నతిపై వెళ్లి ప్రధానోపాధ్యాయులుగా కూడా సేవలందించి, 101తో ఉన్న రోల్ ను 121 కి పెంచి నాలుగేళ్లు సర్వీస్ నందించిన తిరుమలరావు, 2023లో జరిగిన బదిలీల్లో శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు నియామకం పొందారు.  
చేరిన మూడు నెలలకే ఆయనను పని సర్దుబాటు డెప్యుటేషన్ బదిలీల్లో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం వోని ఎంపియుపి పాఠశాలకు నియామకం ఐనారు. అలా ఆ విద్యా సంవత్సరం వోని లో గడిచింది. 2024వేసవి సెలవుల ముందు రోజు తిరిగి యథాస్థానమైన కడుము హైస్కూల్ కు పంపేయడంతో ఆయన రెండో సారి కడుమున చేరిరి. మరలా మూడు నెలల తర్వాత పని సర్దుబాటు డెప్యుటేషన్ బదిలీల్లో భాగంగా అదే కొత్తూరు మండలంలో గల పాతపొన్నుటూరుకు వెళ్ళమనడంతో ఈ విద్యా సంవత్సరమంతా ఎంచక్కా పాతపొన్నుటూరులో సేవలందించారు. మరలా మొన్న వేసవి సెలవుల ముందు రోజు తిరుమలరావు యథా స్థానానికి అనగా కడుము హైస్కూల్ కి పంపబడడంతో ముచ్చటగా మూడోసారి చేరిక జరిగింది. 
కొందరైతే జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు, ఈ బంతాటలో భాగమైపోయారే అంటూ వ్యాఖ్యానించారు. ఏది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించవలసిందే కదా. ఇలా 2023, 2024, 2025 లలో ముచ్చటగా మూడోసార్లు కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గొర్లె తిరుమలరావు గారిచే నియామకం పొందుటతో తిరుమలరావు ఒక కొత్త అనుభూతిని పొందానని అంటున్నారు. ఐతే కేవలం ఆరునెలల్లోనే కడుము పాఠశాల కార్యక్రమాల్లోనూ బోధనాభ్యసనా ప్రక్రియలందు తనదైనశైలిలో సృజనాత్మకతతో సేవలందించారు. 
తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. 
ఈ సందర్భంగా నాలుగేళ్లు నాలుగు పాఠశాలలకు సేవలను అందించిన ఒక విచిత్రమైన పోకడ తిరుమలరావు ఎదుర్కొన్నట్లయింది. ఈ లెక్కన ప్రస్తుత కడుము హైస్కూల్లో కేవలం ఆరునెలలే పనిచేసిననూ మొక్కలు నాటింపు, గైర్హాజరైన విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చలు, నూతన ప్రవేశాలకై నమోదులకై కృషి, ప్రత్యేక పర్వదినాల్లో పోటీలు నిర్వహించి బహుమతులను అందజేయుట, విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేలా పలు కృత్యాలను నిర్వహించుట, ఆరోగ్య సూత్రాలు చిత్రలేఖనం వ్యాసరచన క్విజ్ పాటలు ఆటలు క్రీడలందు పాల్గొని సహకరించుట, ప్రత్యేక తరగతుల నిర్వహణ, సమాజ భాగస్వామ్యం, పూర్వ విద్యార్ధుల సమ్మేళనంలో పాల్గొనుట, మధ్యాహ్న భోజన పథకం తర్ల్ ఎల్ ఇ పి, టోఫెల్ వంటి విద్యాభివృద్ధికి సంబంధించిన అంశాలయందు తన సేవలతో కీలక భూమిక పోషించారు. ఈ సందర్భంగా తనకెంతగానో సహకరించి గౌరవించిన కొత్తవలస, వోని, పాతపొన్నుటూరు, కడుము పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తిరుమలరావు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కామెంట్‌లు