న్యాయములు -839
"క్షు త్స్వాదుతాం జన యతి"న్యాయము
*****
క్షుధ్ అనగా క్షుధా, ఆకలి. స్వాదుతాం అనగా రుచిగా ఉంది.జనయతి అనగా జననం, పుడుతుంది, సృష్టిస్తుంది అనే అర్థాలు ఉన్నాయి.
ఆకలి ఉంటే రుచి పుడుతుంది లేదా ఆకలి మంచి రుచిని సృష్టిస్తుంది.జిజ్ఞాస ఉంటేనే చదువు వంటబడుతుంది అని అర్థము.
దీనినే "క్షుధా స్వాదుతాం జనయతి" అని కూడా అంటారు. ఆకలి మంచి రుచిని సృష్టిస్తుంది. అంటే కొత్త రుచిని సృష్టించడం కాదు. బాగా ఆకలి వేసినప్పుడు ఏది తిన్నా రుచిగానే అనిపిస్తుంది.అంటే నిజమైన రుచి ఏమిటో మనసుకు తట్టక పోయినా, విపరీతంగా అవుతున్న ఆకలి వలన నాలుకకు మాత్రం ఏది తిన్నా రుచిగానే అనిపిస్తుంది.
అందుకే మన పెద్దవాళ్ళు దీనికి దగ్గరగా "ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు" అనే సామెతను చెబుతుంటారు.
అయితే ఆయుర్వేదంలో "క్షుత్ స్వాదుతాం జనయతి" అంటూ ఉంటారు. అనగా ఆకలి ఉత్తమమైన ఆకలి. నిజంగా ఆకలిగా ఉన్నప్పుడే తినండని ఆయుర్వేద వైద్యులు అంటుంటారు.
విదుర నీతిలో ఇలా అంటాడు. "సంపన్న తరమే వాన్నం దరిద్ర భుంజతే సదా!!/క్షుత్ స్వాదుతాం జనయతి సా చాధ్యేషు సుదుర్లభా!!
ధనవంతుల కంటే పేద లేదా దరిద్రులైన వ్యక్తులలో ఆకలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.కాబట్ఠి వాళ్ళు ఎల్లప్పుడూ రుచికరమైన ఆహారాన్ని పొందుతారు.దీనికి విరుద్ధంగా ధనవంతులు అన్ని రకాల ఆహారాలు కలిగి ఉన్నప్పటికీ ఆకలిని కలిగి వుండరు అని అర్థము.ఎందుకు? అనే ఆలోచన టక్కున వస్తుంది.కారణం ఏమిటంటే చాలా మందికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి. అందువల్ల ఆహారం ఎంత రుచిగా ఉన్నా తీసుకోలేరు.
దీనినే కాళోజీ నారాయణరావు తన కవిత్వంలో "ఆకలి మంటలు ఒకచోట - అన్నపు రాసులు ఒకచోట" అని రాశారు. ఓ కవి "ఉన్నవాడికి తింటే అరగదు- లేని వాడికి తిండి దొరకదు" అన్నాడు.
ఇదంతా కేవలం ఆహారం విషయానికేనా అంటే కానే కాదు చదువుకు,జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. చదవాలనే కోరిక ఉంటేనే చదువు వస్తుంది. ఆ కోరిక లేని వ్యక్తికి ఎంత గొప్పగా చదువు చెప్పినా చదువు ఒంట బట్టదు.
అందుకే అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని గుఱ్ఱాన్ని నీళ్ళ వద్దకు తీసుకెళతాం కానీ గుఱ్ఱానికి దాహంగా లేకుండా నీటిని తాగించ లేము."
అలాగే చదవాలని కోరిక లేని విద్యార్థులకు ఎంత చెప్పినా "బూడిదలో పోసిన పన్నీరే" .నేటి విద్యార్థుల చదువులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
మరి మనమేం చెయ్యాలి? అంటే అలాంటి వాతావరణం కల్పించాలి. ఏది తనంత తానుగా దరి చేరదు. జిజ్ఞాస లేనిది ఏదీ రాదు.గొప్ప గొప్ప వ్యక్తులు జిజ్ఞాస తోనే ఎన్నో సాధించారు.కొత్త కొత్త ఆవిష్కరణలు చేశారు అని అవగాహన కలిగించాలి.
అలాంటి జిజ్ఞాస పిల్లలకు ఇంటి నుండే రావాలి.తల్లిదండ్రులే వారికి అలాంటి వాతావరణం కలిగించాలి..
"ఇదండీ!"క్షు త్స్వాదుతాం జనయతి న్యాయము" లోని అంతరార్థము. ఇది ఆకళింపు చేసుకుని ఆకలికి,చదువుకు వర్తింప జేసి ఉదాహరణగా చెప్పారు మన పెద్దలు.మరి మనం మన ముందున్న తరానికి అర్థమయ్యేలా చెబుదాం.
"క్షు త్స్వాదుతాం జన యతి"న్యాయము
*****
క్షుధ్ అనగా క్షుధా, ఆకలి. స్వాదుతాం అనగా రుచిగా ఉంది.జనయతి అనగా జననం, పుడుతుంది, సృష్టిస్తుంది అనే అర్థాలు ఉన్నాయి.
ఆకలి ఉంటే రుచి పుడుతుంది లేదా ఆకలి మంచి రుచిని సృష్టిస్తుంది.జిజ్ఞాస ఉంటేనే చదువు వంటబడుతుంది అని అర్థము.
దీనినే "క్షుధా స్వాదుతాం జనయతి" అని కూడా అంటారు. ఆకలి మంచి రుచిని సృష్టిస్తుంది. అంటే కొత్త రుచిని సృష్టించడం కాదు. బాగా ఆకలి వేసినప్పుడు ఏది తిన్నా రుచిగానే అనిపిస్తుంది.అంటే నిజమైన రుచి ఏమిటో మనసుకు తట్టక పోయినా, విపరీతంగా అవుతున్న ఆకలి వలన నాలుకకు మాత్రం ఏది తిన్నా రుచిగానే అనిపిస్తుంది.
అందుకే మన పెద్దవాళ్ళు దీనికి దగ్గరగా "ఆకలి రుచి ఎరుగదు నిద్ర సుఖమెరుగదు" అనే సామెతను చెబుతుంటారు.
అయితే ఆయుర్వేదంలో "క్షుత్ స్వాదుతాం జనయతి" అంటూ ఉంటారు. అనగా ఆకలి ఉత్తమమైన ఆకలి. నిజంగా ఆకలిగా ఉన్నప్పుడే తినండని ఆయుర్వేద వైద్యులు అంటుంటారు.
విదుర నీతిలో ఇలా అంటాడు. "సంపన్న తరమే వాన్నం దరిద్ర భుంజతే సదా!!/క్షుత్ స్వాదుతాం జనయతి సా చాధ్యేషు సుదుర్లభా!!
ధనవంతుల కంటే పేద లేదా దరిద్రులైన వ్యక్తులలో ఆకలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది.కాబట్ఠి వాళ్ళు ఎల్లప్పుడూ రుచికరమైన ఆహారాన్ని పొందుతారు.దీనికి విరుద్ధంగా ధనవంతులు అన్ని రకాల ఆహారాలు కలిగి ఉన్నప్పటికీ ఆకలిని కలిగి వుండరు అని అర్థము.ఎందుకు? అనే ఆలోచన టక్కున వస్తుంది.కారణం ఏమిటంటే చాలా మందికి శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి. అందువల్ల ఆహారం ఎంత రుచిగా ఉన్నా తీసుకోలేరు.
దీనినే కాళోజీ నారాయణరావు తన కవిత్వంలో "ఆకలి మంటలు ఒకచోట - అన్నపు రాసులు ఒకచోట" అని రాశారు. ఓ కవి "ఉన్నవాడికి తింటే అరగదు- లేని వాడికి తిండి దొరకదు" అన్నాడు.
ఇదంతా కేవలం ఆహారం విషయానికేనా అంటే కానే కాదు చదువుకు,జ్ఞానానికి కూడా వర్తిస్తుంది. చదవాలనే కోరిక ఉంటేనే చదువు వస్తుంది. ఆ కోరిక లేని వ్యక్తికి ఎంత గొప్పగా చదువు చెప్పినా చదువు ఒంట బట్టదు.
అందుకే అలాంటి వారిని దృష్టిలో పెట్టుకొని గుఱ్ఱాన్ని నీళ్ళ వద్దకు తీసుకెళతాం కానీ గుఱ్ఱానికి దాహంగా లేకుండా నీటిని తాగించ లేము."
అలాగే చదవాలని కోరిక లేని విద్యార్థులకు ఎంత చెప్పినా "బూడిదలో పోసిన పన్నీరే" .నేటి విద్యార్థుల చదువులే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.
మరి మనమేం చెయ్యాలి? అంటే అలాంటి వాతావరణం కల్పించాలి. ఏది తనంత తానుగా దరి చేరదు. జిజ్ఞాస లేనిది ఏదీ రాదు.గొప్ప గొప్ప వ్యక్తులు జిజ్ఞాస తోనే ఎన్నో సాధించారు.కొత్త కొత్త ఆవిష్కరణలు చేశారు అని అవగాహన కలిగించాలి.
అలాంటి జిజ్ఞాస పిల్లలకు ఇంటి నుండే రావాలి.తల్లిదండ్రులే వారికి అలాంటి వాతావరణం కలిగించాలి..
"ఇదండీ!"క్షు త్స్వాదుతాం జనయతి న్యాయము" లోని అంతరార్థము. ఇది ఆకళింపు చేసుకుని ఆకలికి,చదువుకు వర్తింప జేసి ఉదాహరణగా చెప్పారు మన పెద్దలు.మరి మనం మన ముందున్న తరానికి అర్థమయ్యేలా చెబుదాం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి