అంగమహారాజుకి సంతానం లేదు.అందుకే ఆయన యాగం చేసినా దేవతలు వచ్చి హవిస్సు పుచ్చుకోలేదు. "రాజా!నీకు పిల్లలు లేరు కాబట్టి దేవతలు రారు " అని ఋత్వికులు అనటంతో ఆయన పుత్ర కామేష్ఠి యాగంచేశాడు.పాయసంని భార్య సుమీధికి ఇచ్చాడు.ఆమె మృత్యువు కూతురు. ఆమె పాయసం తిన్నది.కానీ క్షేత్ర దోషంవల్ల వ్యగ్రస్వరూపుడైన కొడుకు వేనుడు పుట్టాడు.వాడు విచ్చలవిడిగా అధర్మంగా బాల్యంనుంచే దుష్ట స్వభావం కలవాడు.వేటకెళ్లి అమాయక కుందేళ్లు జింకల్ని చంపేవాడు.సాధుజీవుల్ని సతాయించటం, పిల్లల్ని బడితె పట్టుకుని చావబాదేవాడు. రాకుమారుడు కావటంతో ఎవరూ నోరెత్తేవారేకాదు. ఈకథ ద్వారా వ్యాసుడు ఏంచెప్పాడంటే పెళ్లి అనేది అటుయిటు 7తరాలు వంశాల మంచిచెడులు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే పిల్లలకు పెళ్లి చేయాలి.భాగవతం లో పోతన అంగరాజు కథ ద్వారా ఏమి చెప్పాడంటే ఎంతమహారాజైనా దుష్ట సంతానం తో ఎలాంటి సుఖసంతోషాలు పొందలేడు. దుర్మార్గుడైన కొడుకులవల్ల ధార్మికులైన తల్లిదండ్రులు శిక్షపొందుతారు. అందుకే వేనుడి ఆగడాలు భరించలేక అంగరాజు విరక్తుడై ఎవరికీ చెప్పకుండా అడవికెళ్లిపోతాడు విరాగియై! మరి నేడు భయంభక్తి లేని పెద్దలు తమ పిల్లలకు సుద్దులుబుద్ధులు చెప్పక తామే అవినీతి అక్రమ మార్గంలో మద్యపానమత్తులై మునిగితేలుతూంటే, భావితరాల భవిత అగమ్యగోచరం.ఇప్పటికే కుటుంబ సంబంధ బాంధవ్యాలు దెబ్బ తిన్నాయి. ఇప్పటికైన మనం మేలుకొని ఇలాంటి పురాణ గాథల అంతరార్థం చెప్పాలి🌹
అంగమహారాజు...అచ్యుతుని రాజ్యశ్రీ
అంగమహారాజుకి సంతానం లేదు.అందుకే ఆయన యాగం చేసినా దేవతలు వచ్చి హవిస్సు పుచ్చుకోలేదు. "రాజా!నీకు పిల్లలు లేరు కాబట్టి దేవతలు రారు " అని ఋత్వికులు అనటంతో ఆయన పుత్ర కామేష్ఠి యాగంచేశాడు.పాయసంని భార్య సుమీధికి ఇచ్చాడు.ఆమె మృత్యువు కూతురు. ఆమె పాయసం తిన్నది.కానీ క్షేత్ర దోషంవల్ల వ్యగ్రస్వరూపుడైన కొడుకు వేనుడు పుట్టాడు.వాడు విచ్చలవిడిగా అధర్మంగా బాల్యంనుంచే దుష్ట స్వభావం కలవాడు.వేటకెళ్లి అమాయక కుందేళ్లు జింకల్ని చంపేవాడు.సాధుజీవుల్ని సతాయించటం, పిల్లల్ని బడితె పట్టుకుని చావబాదేవాడు. రాకుమారుడు కావటంతో ఎవరూ నోరెత్తేవారేకాదు. ఈకథ ద్వారా వ్యాసుడు ఏంచెప్పాడంటే పెళ్లి అనేది అటుయిటు 7తరాలు వంశాల మంచిచెడులు పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునే పిల్లలకు పెళ్లి చేయాలి.భాగవతం లో పోతన అంగరాజు కథ ద్వారా ఏమి చెప్పాడంటే ఎంతమహారాజైనా దుష్ట సంతానం తో ఎలాంటి సుఖసంతోషాలు పొందలేడు. దుర్మార్గుడైన కొడుకులవల్ల ధార్మికులైన తల్లిదండ్రులు శిక్షపొందుతారు. అందుకే వేనుడి ఆగడాలు భరించలేక అంగరాజు విరక్తుడై ఎవరికీ చెప్పకుండా అడవికెళ్లిపోతాడు విరాగియై! మరి నేడు భయంభక్తి లేని పెద్దలు తమ పిల్లలకు సుద్దులుబుద్ధులు చెప్పక తామే అవినీతి అక్రమ మార్గంలో మద్యపానమత్తులై మునిగితేలుతూంటే, భావితరాల భవిత అగమ్యగోచరం.ఇప్పటికే కుటుంబ సంబంధ బాంధవ్యాలు దెబ్బ తిన్నాయి. ఇప్పటికైన మనం మేలుకొని ఇలాంటి పురాణ గాథల అంతరార్థం చెప్పాలి🌹
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి