శాంతి సహనం కొంతవరకే:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
కాళ్ళ పారణి ఆరకమునుపే
జీవితాంతం తోడునీడగా ఉంటానన్న 
భర్తను కోల్పోయి నూరేళ్ళ జీవితం ఛిద్రమైన నవవధువు
పసిపిల్లలు, భార్య ఎదుటే భర్తను మతం అడిగి
కిరాతకంగా  చంపి కుటుంబాన్ని అనాథలుగా చేసిన ముష్కరులు
బాధ్యతలు పూర్తయి జీవిత చరమాంకంలో
జమ్మూ కాశ్మీర్ లోని పహల్ గావ్ లోయలోని సుందరదృశ్యాలను చూడాలని వచ్చిన దంపతులలో 
భార్య ఎదుటే విచక్షణా రహితంగా కాల్చి చంపిన నరరూప రాక్షసులు
ఎన్నని ఏమని చెప్పను
భర్తను కోల్పోయి భార్య
తండ్రి ప్రేమకు దూరమైన పసిడి పిల్లలు
వృద్దాప్యంలో కన్నకొడుకును కోల్పోయి
కడుపుకోతకు గురై
ఇరవై ఆరు పౌరుల మృతికి కారణమైన
ఆ నరరూప మృగాల దుశ్చర్యకు ప్రతీక  తీర్చుకోవలసిన బాధ్యత
ప్రధాని మోడీ గారు చెప్పినట్లు 
శాంతి సహనం కొంతవరకే
నూటఏబది కోట్ల భారతీయుల బాధ్యత..!!

    వందేమాతరం
భారతమాతకి జై
............................


కామెంట్‌లు