నూతన సాహిత్య ప్రక్రియ:- పంచరవళి రూపకర్త - డా. ధనాశి ఉషారాణి
 రైతు బిడ్డ లంత కష్ట మునకు
ఓర్చుకోని పుడమి సాగు జేసి
వరిని నాటి పంట తీసి తుదకు
అమ్మ బోతె అడివి యనిరి అలసి
మనసుమురిసె మాట కోరిరంత


రైతులెపుడు రయము తోడ లేసి
దుక్కి నంత దున్ని నీరు గట్టి
బరువు అనక బ్రతుకు సాగ దీసి
బురదలోన ముత్య ములను పట్టి
జగతి కంత జయము నిచ్చు వారె


రైతు బిడ్డ లంత రత్న మేను
కష్ట మేను కాయమునకు ఎపుడు
చెమట నంత చిమ్ము చున్న మేను
పుడమి వంటి పుత్తడేను చూడు
జయము రైతు జయము నీకు వినుము

డా. ధనాశి ఉషారాణి              
పంచరవళి రూపకర్త  
తిరుపతి భాకరాపేట

కామెంట్‌లు