తిరుమలరావుకు రామదాసు సంస్థ పురస్కార ప్రశంసాపత్రం

 కడుము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు మరో పురస్కార ప్రశంసాపత్రం సాధించారు. రామదాసు సాహితీ కళా సేవా సంస్థ ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు డా.దూత రామ కోటేశ్వరరావు నేతృత్వంలో సమవర్తి అను అంశంపై కవిత పోటీలను నిర్వహించగా తిరుమలరావు పంపిన భిన్నత్వంలో ఏకత్వం అనే కవిత ఎంపికై పురస్కార ప్రశంసాపత్రం సాధించింది. ఈమేరకు ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం, సుర్దేపల్లి కేంద్రంగా అంతర్జాలం ద్వారా నిర్వహించిన కవితల పోటీలకు కవిత పంపిన తిరుమలరావును అభినందిస్తూ నిర్వాహకులు పురస్కార ప్రశంసాపత్రం పంపించారు. సమాన హోదా సమానావకాశాలు గూర్చి తొలి ప్రస్థావన మన భారత రాజ్యాంగం ఘనత అని తిరుమలరావు తన కవితలో వివరించారు. ఎవరెవరు వివక్షత లేని సమాజం కోసం పరితపించారో వారి సేవలను తన కవితలో చాటిచెప్పారు. తిరుమలరావుకు పురస్కార ప్రశంసాపత్రం లభించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
కామెంట్‌లు