డి. ఇ. ఓ. శామ్యూల్ పాల్చే సోమన్న "బాలలలోకం" పుస్తకావిష్కరణ

 పెద్దకడబూర్ మండల పరిధిలోని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  డా.గద్వాల సోమన్న 69వ పుస్తకం  "బాలల లోకం"  పుస్తకావిష్కరణ కర్నూలు జిల్లా డి. ఇ. ఓ శామ్యూల్ పాల్ గారి చేతుల మీద సెయింట్ జోసఫ్ పాఠశాల, అదోనిలో ఘనంగా జరిగింది. అదోని డివిజన్ పరిధిలోని ప్రధానోపాధ్యాయులు మరియు మండల విద్యాధికారుల సమావేశంలో కవి గద్వాల సోమన్న పుస్తకావిష్కరణ జరగడం గమనార్హం.ఈ కార్యక్రమంలో యం.సి.గిడ్డయ్య,ముగతి ప్రతాప్,టి.ఆంజనయ్య, యం.రాజు మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. పుస్తక కృతికర్త గద్వాల సోమన్న ను డి. ఇ. ఓ యస్.శామ్యూల్ పాల్ గారు,అధికారులు,ఉపాధ్యాయులుశ్రేయోభిలాషులు.అభినందించారు.
కామెంట్‌లు