కవులు మేల్కోవాలి:- రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి
సాహితీ కెరటాలు
=============
 జననీ ,జన్మభూమిశ్చ
స్వర్గాదపి గరీయసీ  అన్నది
వేద సూక్తము.

  ఈ  రెండు భక్తులు ఉంటేనే
వాడు సరియైన మనిషి.

   దేశం కోసం ప్రాణాలర్పించిన  భగత్ సింగ్ ,
అల్లూరి , నేతాజీ ఇంకా ఎందరో 
అమరవీరులు దేశం కోసం
ప్రాణాలర్పించారు .

వారు సంపాదించి ఇచ్చిన
స్వతంత్ర్యాన్ని కాపాడుకోవడం మన విధి.

   దేశ సరిహద్దుల్లో ,రక్తం గడ్డ
కట్టే చలిలో దేశం కోసం ప్రాణ త్యాగం చెయ్యటానికైనా సిద్ధమే అని
భరత మాత కోసం పహరా
కాస్తున్నారు.

  మువ్వన్నె జెండా నీడలో మనల్ని సంతోషంగా ఉండమని , మనకోసం  వారు
సరిహద్దుల్లో నిలబడుతున్నారు.

  పాఠశాలలో పిల్లలకి భారత దేశం నా మాతృభూమి అని
రోజూ ప్రార్ధన గీతంతో పాటుగా చెప్పించాలి.

  అప్పుడే పిల్లల్లో దేశభక్తి పెరుగుతుంది. వారే కదా రేపటి పౌరులు.

  దేశాన్ని జాగ్రత్త గా కాపాడు
కోవలసిన బాధ్యత వారి మీద ఉంది.

   ఆగష్టు 15 నే కాక దేశభక్తి
ని కాంక్షించే ఆర్ ఎస్ ఎస్
లాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు రావాలి.

   మన జాతీయ ఆదాయాన్ని పెంచుకోవడానికి యువకులు విదేశాలకు వెళ్ళక , మన దేశ భవిష్యత్తును కాంక్షించి , వారి మేథాశక్తిని మన దేశం కోసం ఉపయోగించాలి.

  దాని కోసం ప్రభుత్వాలు కూడా వారికి అండదండగా
ఉండాలి. 

   రైతే రాజు. రైతు లేనిదే ఆహారం లేదు. అందుకే రైతులను కూడా ప్రభుత్వాలు ఆదుకోవాలి.

  అన్ని రంగాల వారు దేశ భక్తితో ఉన్నపుడే , దేశం పురోభివృద్ధి  చెందుతుంది.

  గడప లోపలే కులం , గడప దాటితే భారతీయులం అనే
సంకల్పం ప్రతి ఒక్కరిలోను
రావాలి.

   స్వతంత్ర  సమరంలో ఎందరో కవులు స్వతంత్ర
ఉష్ణ జ్వాలలను  ప్రతి వారిలో రగిల్చారు.

  ఇప్పటి కవులు కూడా అలాంటి దేశ భక్తిని ప్రజల్లో
చైతన్యాన్ని తీసుకు రావాలి.

   మరి దేశంలో ఉన్న కొందరు నాయకులు దేశాన్ని
పంచుకు తినాలని చూస్తున్నారు. అటువంటప్పుడు వారి చేతుల్లోకి దేశం వెళ్లకుండా
దేశ భక్తులైన వారిని , ప్రజలు
ఎన్నుకోవాలి.  అప్పుడే దేశం
ప్రగతి బాట పడుతుంది.

కామెంట్‌లు