ఆవిడ 11 మంది పిల్లలకు తల్లి. 24 మంది పిల్లలకు అమ్మమ్మ. ఆవిడ వయస్సు 67 ఏళ్లు.
ఒక రోజు ఆవిడ తన కుటుంబ సభ్యులతో తాను కాస్సేపు అలా అలా నడిచొస్తానని చెప్పారు. ఆవిడ మాటకు సరేనన్నారు కుటుంబసభ్యులు. జాగ్రత్తగా వెళ్ళి రమ్మన్నారు. ఎవరైనా తోడొస్తారంటే వద్దన్నారావిడ.
కానీ ఆవిడ చరిత్ర సృష్టించబోతోందన్న నిజం కుటుంబసభ్యులకు తెలియదు.
1887లో ఒహియోలో జన్మించిన ఎమ్మా రోవెనా గేట్వుడ్ తన జీవితంలో అప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. యవ్వనంలో అడుగడుగునా ఎన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించారు. కొత్త క్షితిజాలను వెతకడానికి ఆవిడ సన్నద్ధమయ్యారు.
1955లో, కేవలం ఒక జత కెడ్స్ స్నీకర్లను ధరించి, ఇంట్లోనే తయారుచేసిన డెనిమ్ బ్యాగ్ను తీసుకుని ఆవిడ అజేయమైన దృఢ సంకల్పంతో బయలుదేరారు.
480 మిలియన్ సంవత్సరాల పురాతన అప్పలాచియన్
పర్వత శ్రేణి లో నడిచి ఆవిడ చరిత్రపుటలకెక్కారు. ఒంటరిగా నడకను మైదానాలు పెట్టిన
ఆవిడ జార్జియా నుండి మైనే వరకు పర్వతశ్రేణి, అడవుల గుండా 2,168-మైళ్ల (3,470 కి.మీ) మార్గంలో నడిచిన తొలి మహిళగా సంచలనం సృష్టించారు.
ఎక్కడా వివరణాత్మక మ్యాప్లు లేకుండా, ఆవిడ తన సహజ జ్ఞానం, ప్రకృతి వనరులు, అపరిచితుల దయపై ఆధారపడి ఈ నడక యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. అరవై ఏడేళ్ళ వయస్సులో ఆవిడ చేసిన సాహసం
దేశం దృష్టిని ఆకర్షించింది.
కానీ ఎమ్మా అక్కడితో ఆగలేదు: 1960లో, ఆమె మళ్ళీ ఆ కాలి బాటన మరింత ఎక్కువ దూరం నడిచారు. 1963లోనూ మరిన్ని ప్రదేశాలలో నడిచారు. ఆమె ధైర్యం వేలాది మందిని బహిరంగ ప్రదేశాలను అన్వేషించడానికి ప్రేరేపించింది. సాహసం, స్వేచ్ఛ అందరిలోనూ ఉంటాయని, కానీ ఏదో ఒకటి సాధించాలనే తపన ముఖ్యమని ఆవిడ నిరూపించారు.
ఇప్పటికీ "గ్రాండ్మా గేట్వుడ్" అని ఆవిడ సాహసం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రేరణ, స్వేచ్ఛా స్ఫూర్తికి చిహ్నంగా నిలిచారు ఎమ్మా అంటే అది అతిశయోక్తి కాదు.
ఒక రోజు ఆవిడ తన కుటుంబ సభ్యులతో తాను కాస్సేపు అలా అలా నడిచొస్తానని చెప్పారు. ఆవిడ మాటకు సరేనన్నారు కుటుంబసభ్యులు. జాగ్రత్తగా వెళ్ళి రమ్మన్నారు. ఎవరైనా తోడొస్తారంటే వద్దన్నారావిడ.
కానీ ఆవిడ చరిత్ర సృష్టించబోతోందన్న నిజం కుటుంబసభ్యులకు తెలియదు.
1887లో ఒహియోలో జన్మించిన ఎమ్మా రోవెనా గేట్వుడ్ తన జీవితంలో అప్పటికే అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. యవ్వనంలో అడుగడుగునా ఎన్ని క్లిష్ట పరిస్థితులను అధిగమించారు. కొత్త క్షితిజాలను వెతకడానికి ఆవిడ సన్నద్ధమయ్యారు.
1955లో, కేవలం ఒక జత కెడ్స్ స్నీకర్లను ధరించి, ఇంట్లోనే తయారుచేసిన డెనిమ్ బ్యాగ్ను తీసుకుని ఆవిడ అజేయమైన దృఢ సంకల్పంతో బయలుదేరారు.
480 మిలియన్ సంవత్సరాల పురాతన అప్పలాచియన్
పర్వత శ్రేణి లో నడిచి ఆవిడ చరిత్రపుటలకెక్కారు. ఒంటరిగా నడకను మైదానాలు పెట్టిన
ఆవిడ జార్జియా నుండి మైనే వరకు పర్వతశ్రేణి, అడవుల గుండా 2,168-మైళ్ల (3,470 కి.మీ) మార్గంలో నడిచిన తొలి మహిళగా సంచలనం సృష్టించారు.
ఎక్కడా వివరణాత్మక మ్యాప్లు లేకుండా, ఆవిడ తన సహజ జ్ఞానం, ప్రకృతి వనరులు, అపరిచితుల దయపై ఆధారపడి ఈ నడక యాత్రను విజయవంతంగా పూర్తి చేయడం కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. అరవై ఏడేళ్ళ వయస్సులో ఆవిడ చేసిన సాహసం
దేశం దృష్టిని ఆకర్షించింది.
కానీ ఎమ్మా అక్కడితో ఆగలేదు: 1960లో, ఆమె మళ్ళీ ఆ కాలి బాటన మరింత ఎక్కువ దూరం నడిచారు. 1963లోనూ మరిన్ని ప్రదేశాలలో నడిచారు. ఆమె ధైర్యం వేలాది మందిని బహిరంగ ప్రదేశాలను అన్వేషించడానికి ప్రేరేపించింది. సాహసం, స్వేచ్ఛ అందరిలోనూ ఉంటాయని, కానీ ఏదో ఒకటి సాధించాలనే తపన ముఖ్యమని ఆవిడ నిరూపించారు.
ఇప్పటికీ "గ్రాండ్మా గేట్వుడ్" అని ఆవిడ సాహసం గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ప్రేరణ, స్వేచ్ఛా స్ఫూర్తికి చిహ్నంగా నిలిచారు ఎమ్మా అంటే అది అతిశయోక్తి కాదు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి