ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా తెలగావీధిలో ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా మేడే కార్యక్రమం నిర్వహించారు. యుటిఎఫ్ రాష్ట్ర శాఖ కోశాధికారి రెడ్డి మోహనరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. శ్రమను నమ్ముకోవాలని తద్వారా విజయాలు సాధించవచ్చునని అన్నారు. తొలుత మేడే పతాకాన్ని విశ్రాంత ఉపాధ్యాయులు ద్వారపురెడ్డి భాస్కరరావు ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి పక్కి వాసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కర్షక కార్మిక చెమట చుక్కలను దోచుకునే దోపిడీ దారుల పెట్టుబడిదారీ విధానాలను అంతం చేయడానికి, కష్టజీవుల శారీరక మానసిక ఇబ్బందులను సమూలంగా నిర్మూలించే దిశగా ప్రతి పౌరుడూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మూడడ్ల శ్రీనివాసరావు, అదపాక దామోదరరావు, జి.సిగడాం మండల యుటిఎఫ్ ప్రతినిధి బోనెల గౌరీశ్వరరావు, సంతకవిటి యుటిఎఫ్ అధ్యక్షులు బూరాడ శ్రీనివాసం నినాదాలు పలికి ప్రసంగించారు. జిల్లా సాంస్కృతిక కమిటీ సభ్యులు దన్నాన రామారావు పతాక గీతాన్ని ఆలపించారు. రేగిడి యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి వారాడ సత్యం నాయుడు, వంగర మండల అధ్యక్షులు మర్రాపు ప్రసాద్, రాజాం మండల శాఖ అధ్యక్షులు మువ్వల రమేష్, ప్రధాన కార్యదర్శి బలివాడ నాగేశ్వరరావు, శ్రీకాకుళం జిల్లా యుటిఎఫ్ కౌన్సిలర్ కుదమ తిరుమలరావు, డోల కృష్ణారావు, ఎస్.బాబూరావు నాయుడు, వెంకటరావు, పి.బాలకృష్ణ, బి.రమేష్, ఆర్.దాలినాయుడు, వారణాసి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి