వీధిలో...మూగ జీవుల...వీరంగం..? :- కవి రత్న సాహిత్య ధీర సహస్ర కవి భూషణ్ పోలయ్య కవి కూకట్లపల్లి -అత్తాపూర్....హైదరాబాద్
అయ్యో అయ్యో 
ఓ దైవమా... 
ఏమిటీ ఈ ఘోరం...
ఎందుకింతటి దారుణం...
ఏమైంది ఆ మూగజీవాలకు..?

ఎందుకు ఇంతగా 
క్రూరంగా ప్రవర్తించాయి 
ఆ వాహనదారులెవరూ 
వాటిని కర్రలతో కొట్టినట్టుగాని...
వాటికి ఏదైనా కాసింత బాధనైనా
కలిగించినట్టుగాని లేదే...

మరెందుకు...? ఎందుకు..? 
వీధిలో రెండు ఎద్దులు...
ఇద్దరు మనుష్యులను క్రింద పడేసి 
 ఒకదాని తర్వాత మరొకటి కసితీరా 

వారు తప్పించుకునే 
అవకాశమే లేకుండా మార్చి 
మార్చి కోపంతో పొడిచి పొడిచి...
కొమ్ములతో ఎందుకు కుమ్మేశాయి..?

ఎందరడ్డొచ్చినా 
అదరక బెదరక పాపం 
హఠాత్తుగా ఎందుకు ఆ ఇద్దరు 
వ్యక్తుల జీవితాలతో ఆడుకున్నాయి..?

పట్టపగలు 
నడిబజారులో 
అందరి కళ్ళముందే 
కత్తులతో వీధి రౌడీల్లా... 
పిచ్చిపిచ్చిగా రెచ్చిపోయి 
విచ్చల విడిగా ఎందుకు
వీరంగం సృష్టించాయి...?

ఇద్దరిని కాళ్ళతో తొక్కితొక్కి 
కొమ్ములతో కుళ్ళబొడిచి 
దోపిడీ దొంగల్లా దర్జాగా 
ఎందుకు పారిపోయాయి...?

ఎందుకంత వింతగా... 
ఎందుకంత ఆవేశంగా... 
ఎందుకంత క్రూరంగా... 
ఎందుకంత ఘోరంగా..‌. 
ఎందుకంత దుర్మార్గంగా... 
అతిదారుణంగా ప్రవర్తించాయి..? 
బీభత్సాన్ని సృష్టించాయి..?

దారిన పోయే ఆ
అమాయకపు వ్యక్తులపై
ఎందుకు విరుచుకు పడ్డాయి..?
ఎందుకంత దారుణంగా 
దాడిచేసి ప్రాణాలతో గిలగిలా 
కొట్టుకొనేలా పొడిచేశాయి..?

ఇట్టి మూగజీవాల మీద మనమిక
కనికరం జాలి ఎందుకు చూపాలి...?
ఎందుకు తిండి పెట్టి పోషించాలి...?
ఓ జంతు ప్రేమికులారా...!
ఒక్కసారి ఆలోచించండి...!
అయ్యో ఓ దైవమా ఇది విధిలిఖితమా...
వారి గతజన్మ పాపఖర్మల ఫలితమా..?
ఆ మూగజీవుల వింత ప్రవర్తనకు
అసలు కారణమెంతకూ అర్దం కాకున్నదే...!



కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం