భలే అమ్మాయి: - సరికొండ శ్రీనివాసరాజు

 శ్రావణి తీరిక సమయాలలో కథల పుస్తకాలు చదువుతుంది. వివిధ కథా మేగజైన్సుకు చందా కట్టి పోస్ట్ ద్వారా తెప్పించుకుంటుంది. తాను చదివాక ఇంటికి వచ్చిన తన బంధువుల పిల్లల చేత, స్నేహితుల చేత చదివిస్తుంది. శ్రావణి వాళ్ల ఇంటికి రోజూ దినపత్రికలు కూడా వస్తుంటాయి.
     ఒకరోజు పాత పేపర్లు కొనే వాహనం శ్రావణి వాళ్ల ఇంటివద్ద ఆగింది. శ్రావణి వాళ్ల అమ్మ శర్వాణి పాత పేపర్లు అమ్ముతుంది.  శర్వాణి పేపర్లు అన్నీ ఇంటిముందుకు తీసుకు వచ్చింది.  శ్రావణి వాళ్ల నాయనమ్మ కథల పుస్తకాలూ తెచ్చి తూకానికి వేసింది.  పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన శ్రావణికి ఈ విషయం తెలుస్తుంది.  బోరున ఏడ్చింది శ్రావణి.  ఆ రాత్రి అన్నం కూడా తినలేదు.
    "పోతే పోనీవే ఆ కథల పుస్తకాలు. నువ్వు అన్నీ చదివావు కదా! ఇంటి నిండా ఆ పుస్తకాలు ఎందుకు చెప్పు?" అన్నది నాయనమ్మ. "చుట్టాల పిల్లలకు, స్నేహితులకు ఉపయోగ పడుతున్నాయి కదా!" అన్నది శ్రావణి. "ఏం కథల పుస్తకాలు లేకపోతే వాళ్లకు టైం పాస్ కాదా! టీవీలు ఉన్నాయి.  మొబైల్ ఫోన్లు ఉన్నాయి కదా!" అన్నది నాయనమ్మ. "మరి నువ్వు టీవీ సీరియల్స్ పూర్తిగా మానేసి నాకు టీవీ ఇవ్వు. నా కథల పుస్తకాలు అమ్మినందుకు నీకు ఇదే శిక్ష. తీరిక సమయాలలో నాతో పాటు కూర్చుని నాకు కథలు చెప్పు." అన్నది శ్రావణి.  జన్మలో మళ్ళీ కథల పుస్తకాలు అమ్మకూడదని అనుకుంది నాయనమ్మ. 
     దాదాపు అందరు పిల్లలూ ఈ వయసులో మొబైల్ ఫోన్లకు బానిసలు అయితే తన కూతురు నీతి కథల పఠనం అభిరుచి చేసుకోగా ఇతర పిల్లలకూ నీతి కథలను అలవాటు చేయించుట సంతోషం అనిపించింది శర్వాణికి.  తానూ తన కూతురితో పాటు ఇంటికి వచ్చిన ఇతర పిల్లలనూ కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం మొదలు పెట్టింది శర్వాణి.

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం