సునంద భాష్యం:- వురిమళ్ల సునంద, ఖమ్మం
 న్యాయాలు-907
"నహి ప్రమాణం జంతూనా ముత్తర క్షణ జీవనే "న్యాయము
*****
నహి  అనగా లేదు, అంతేకాదు.ప్రమాణం అనగా ఋజువు, సరైన జ్ఞానము యొక్క అర్థము, ఒట్టు పెట్టుకునుట.జంతూనా అనగా జంతువుల యొక్క.ఉత్తర క్షణం అనగా తదుపరి క్షణం, తరువాత సమయం.జీవనే అనగా  జీవితంలో అని అర్థము.
జంతువులు ఉత్తర క్షణములో జీవించి ఉంటాయని చెప్పడానికి వీలు లేదు.అనగా "ఎప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో, మరణం ఎలా సంభవిస్తుందో చెప్పలేం" అని అర్థము.
ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే  ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరమూ ఊహించలేము. లవకుశ సినిమాలో ప్రముఖ గీత రచయిత కొసరాజు గారి పాట ఈ సమయంలో ఎవరికైనా గుర్తుకు వస్తుంది." ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు/ విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు". అంటూ సీతమ్మ వారు అడవిలో ఉండవలసి వచ్చిన పరిస్థితిని గురించి ఈ పాటను రాసినప్పటికీ ఇది ప్రతి జీవికి వర్తిస్తుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించగలమా ?  సాహసించగలమా?విధి రాతను తప్పించుకోగలమా? అనేదే ఇందులోని అంతరార్థం.
దీనికి సంబంధించిన ఉదాహరణ ఈ మధ్యనే మన దేశంలో జరిగిన ఘోర విమాన ప్రమాద సంఘటన. 260కి పైగా ప్రయాణీకులు మరియు మెడికల్ విద్యార్థులు ఈ ప్రమాదంలో చిక్కుకుని మరణించడం. అప్పటి వరకు ఎంతో ఉత్సాహంగా,ఉల్లాసంగా కాలం గడుపుతూ ,గమ్య స్థానము చేరేందుకు సిద్ధమైన వారంతా క్షణాల్లో మృత్యువాత పడతారని వారు కానీ, మనం కానీ కలలో కూడా ఊహించలేదు.
అనగా ఏ క్షణములో ఏం జరుగుతుందో తెలియదు. మన పుట్టుక మనకు తెలియదు. మన మరణం మన ఊహకు అందదు.అనగా పుట్టేది, పోయేది మరుక్షణములో ఏం జరిగేది? అంతు చిక్కదు.అయినా మనుషుల్లో కొందరు అన్నీ తెలుసని విర్రవీగుతూ ఉంటారు. అంతే కాదు స్వాములుగానో,బాబాలు గానో చెలామణి అవుతూ, ప్రజలను మోసం చేస్తూ ఉంటారు.అందుకే విజ్ఞులైన మన పెద్దవాళ్ళు "జీవితం క్షణ భంగురం" ఎప్పుడేం జరుగుతుందో తెలియదు.కాబట్టి ఉన్న క్షణాల్లో సత్కార్యాలు చేస్తూ ,సంతృప్తిగా జీవితాన్ని గడపమని పదే పదే హెచ్చరిస్తూ ఉంటారు.
జీవితం క్షణ భంగురం. ఎవరైనా ప్రమాణ పూర్వకముగా "ఇదిగో ఇంత కాలం బతుకుతావు? అని ఎవరూ ప్రమాణపూర్తిగా చెప్పలేరు.  అంటారు మన పెద్దలు."దీనినే తాత్త్వికులు " ఇల్లు ఇల్లు అంటావు - ఉల్లాస పడతావు నీ ఇల్లు ఎక్కడే మనసా!!" అంటూ అంటూ రాసిన పాట కూడా మనిషి యొక్క జీవిత అనిశ్చితిని తెలియజేస్తుంది.
 కాబట్టి ఈ "నహి  ప్రమాణాం జంతూనా ముత్తరక్షణ జీవనే" న్యాయము ద్వారా మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే "ఈ జీవితం కాదు" కాబట్టి మనకున్న ఈ చిన్న జీవితాన్ని  సద్వినియోగం చేసుకోవాలి.ఇదే ఈ న్యాయము లోని ఆంతర్యము.అంతకంటేముఖ్యంగా జీవించే ప్రతి క్షణం  ఒక వరంగా భావించాలి, దానిని అందరూ మెచ్చే విధంగా చెట్టులానో ,నదిలానో సద్వినియోగం చేసుకోవాలి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం