అరుణాక్షర కవితా తోరణాలు ' అరుణరాగాలు' అంతర్జాల కార్యక్రమం
  'అరుణోదయ 'సాహితీ వేదిక, అనుబంధ సంస్థల,' అరుణాక్షర కవితా తోరణాలు ( కవితలు ) ' అరుణరాగాలు' ( పాటలు )  కలిసి అంతర్జాలంగా జరిగిన  కార్యక్రమం మంగళవారం దిగ్విజయం గా ముగిసింది.
ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథి గా డా. నాళేశ్వరం శoకరం గారుప్రాఖ్యాతవక్త( OUప్రొఫెసర్) గారు,
సభాద్యక్షులుగా  డా. రామకృష్ణ చంద్రమౌళి గారు, సాహిత్యవేత్త,సలహాదారులు,విమర్శకులు, (సెయింట్ పాయెస్ వి్మెన్స్ డిగ్రీ అండ్ pG కాలేజ్ )ఆత్మీయ అతిథిగా   ఘంటా మనోహర్ రెడ్డిగారు సాహిత్య వేత్త, ప్రముఖ వక్త ( rtd. వాణిజ్య పన్నుల అధికారి )
 డా. కృష్ణారెడ్డి గారు సాహిత్య వేత్త, సమీక్షకులు, సమాజ సేవకులు ( rtd అధికారి)లు  మా ఆహ్వానం మేరకు విచ్చేసి 
ఎంతో సాహిత్య విజ్ఞాన విషయాలను,వచన కవిత మెలకువలు, శైలి, అంశం, ఎత్తుగడ, ముగింపు ఇలా వచన కవిత్వం  గురించి ప్రస్తావిస్తూ, కవులకు  వివరణ ఇచ్చారు.పాట ప్రాముఖ్యం, పాటలరకాలు, పాట ఏవిధంగా రక్తి కట్టి  ప్రేక్షకుల మదిని  దోచుకుంటుంది అనే  విషయాల మీద  చాలా  చక్కగా  ప్రసoగించారు.
దాదాపు 4 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో టైము కూడా  తెలవనంత ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోయింది,డా. నర్సింహశర్మగారి  సమ్మేళన నిర్వహణ, ముగింపు పలుకులతో సభ దిగ్విజయంగా  ముగిసింది.
 'అరుణోదయ ' అంతర్జాల కార్యక్రమంరానురాను   ఎంతో  ఉత్సహంగా ముందుకు  వెళ్తున్నందుకు  డా. రామకృష్ణ చంద్రమౌళి గారు సభాఅధ్యక్ష్యత నిర్వహిస్తూ  అభినందించడం సంతోషకరం.
డా. నాళేశ్వరంశంకరం గారు అరుణోదయ సాహితీ సంస్థ విజ్ఞాన దాయకంగా, అనేకమంది కవులు రాసే కవితలు  చాలా  బాగుంటున్నాయని, అరుణారాగాల్లో  పాటలు కూడా  వింటున్నానని, గాయనీ, గాయకులు  చక్కగా పా డుతున్నారని  ప్రశంసిoచారు.
ముందు  ముందు  ఏం  చేస్తే  బాగుంటుందో  కూడా  కొన్ని సలహాలు ఇవ్వడం ఆనందకర విషయం.
ఎంత  ఆనందంగా 4 గంటల పాటుస్నేహ పూర్విత వాతావరనం గా జరిగిన ఈ కార్యక్రమంలో  అనేక మంది కవులు, గాయనీ, గాయకులు  కవితాగానం, పాటలు  పాడి సభను  రక్తి కట్టించారు.
   ఇంత  విజవంతం చేసినందుకు  సమూహ అధ్యక్షు రాలు డా. అరుణ కోదాటి  అందరికీ  పేరు  పేరునాకృతజ్ఞతలు తెలిపింది.

కామెంట్‌లు