స్ఫూర్తిదాతలు:- సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 దివ్యాంగులకి మనం ఉపాధి చూపాలి అంతేకానీ వారిపై సానుభూతి చూపరాదు చేతనైతే వారి బాధ నిరుద్యోగం తీరేలా కొన్ని మార్గాలు సూచించాలి అలాంటి స్ఫూర్తిదాత దివ్యాంగుడు వినీత్ సారాయివాలా ఒక సంస్థను 20 20 లో స్థాపించాడు దాని పేరు ఏటిపికల్ అడ్వాంటేజ్ ఇందులో దివ్యాంగులకు రకరకాల ఉపాధి మార్గాలు చూపిస్తున్నారు వినీత్ అసలు ఎవరీయన అంటే బాల్యంలోనే కంటిచూపు సమస్యతో బాధపడిన ఆయన బెంగుళూరులో ఐఐఎం లో చదివారు వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు తన భౌతిక సమస్యను దూరంగా పెట్టి మంచు కొండల్లో సైకిల్ యాత్ర మారుతాన్లలో పాల్గొన్నారు ఈయన రకరకాల మానసిక భౌతిక సమస్యలతో బాధపడే వారికి వారి వారి అభిరుచులకి తగ్గట్లు శిక్షణ ఇప్పిస్తారు కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తారు గూగుల్ అమెజాన్ టెల్ లాంటి సంస్థల్లో దివ్యాంగులు పనిచేయటానికి కారణం వినీత్ అంటే అతిశయోక్తి కాదు డాన్సర్లుగా గాయకులుగా ఆర్టిస్టులుగా ఫోటోగ్రాఫర్లుగా ఎంతోమంది ఈయన ఆధ్వర్యంలో నడిచే ఎటిపికల్ అడ్వాంటేజ్ ద్వారా వెలుగులోకి వస్తున్నారు.కోయంబత్తూర్ కి చెందిన రఘురాం అనే ఆయన పల్లెలో పిల్లలకు పుస్తకాలు అందించే ఉద్దేశంతో ఆరం అనే ట్రస్టు ప్రారంభించారు స్టడీ మెటీరియల్ ను రిటైర్డ్ టీచర్ల చేత రాయించి ప్రింట్ చేయించి టెన్త్ ఇంటర్ విద్యార్థులకు ఫ్రీగా ఇస్తున్నారు ప్రతి ఏడు ఏడు వెయ్యి మంది విద్యార్థులకు మాక్ టెస్టులు నిర్వహిస్తున్నారు బీద పిల్లలకు మ్యూజియం ఫ్యాక్టరీలు మొదలైన వాటికి తీసుకెళ్లి వారికి అవగాహన కల్పిస్తున్నారుబీహార్ కి చెందిన పోలీస్ అధికారి అజయ్ బహదూర్ సింగ్ నేరస్తుల పిల్లలకు చదువు చెప్తున్నారు తన పని చేస్తున్న పోలీస్ స్టేషన్లో ట్యూషన్స్ చెప్పుతో వారికి ఆటలు పోటీలు కూడా పెడుతున్నారు లైబ్రరీ ఏర్పాటు చేసి విద్యార్థులకు సాయం చేస్తున్నారు ఈయన నక్సల్స్ ప్రాంతంలో గ్రామాలకి వెళ్లి పిల్లలు పెద్దలు లో గొప్ప మార్పు తీసుకుని వచ్చారురాజస్థాన్ కి చెందిన దేవ్ అమిత్ ఏక్ పహల్ ఇండియా అనే సంస్థతో కోచింగ్ సెంటర్ ఏర్పాటుచేసి విద్యార్థులకు ఫీజు ఖర్చు మానసిక ఒత్తిడి లేకుండా చేస్తున్నారు ఆత్మహత్యలు తగ్గాయి ఈయన కోచింగ్ సెంటర్ వల్ల మూడు వేల మంది పైగా లాభం పొందారు అందులో 100 మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు రావడం ముదావ హమ్🌹
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం