11వ సర్గ: - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట


నీ పుణ్యము మీద ప్రమాణము చేసి 
నీవు వరములను ఇచ్చుచున్నావు 
నీవు పలికిన మాటలు దేవతలిన్నారు
దివి, భువి నీ ప్రతిజ్ఞను విన్నారు 

ఓ రాజా! ఆనాడు దైవసురునితో
జరిగిన పూర్వ యుద్ధమున నీకు 
శత్రుభాణాలు తాకి మూర్చిల్లితివి
ఆరోజు నేను నిన్ను కాపాడితిని

ఆ సంతోషమున రెండు వరములను 
నాకు ఇచ్చితివి ఆ వరములనిపుడు
నిన్ను నేను కోరుచున్నాను రాజా! 
ధర్మమునకు కట్టుబడి వరములివ్వుము

నీవు ఆ వరములను తిరస్కరించినచో 
నా నాప్రాణములను త్యజించెదను 
శ్రీరాముని వనమునకు పంపి 
భరతునకు పట్టాభిషేకము చేయుము

ఇప్పుడేరాముడు వనమునకెళ్ళవలెను
భరతుడు యువరాజుగా యుండవలెను
 రాజులకే రాజువు సత్యము నిలుపుము 
నీ వంశశీలమును రక్షించుము రాజా! 

==========================
అయోధ్యకాండమందు 11వ సర్గ సమాప్తము🙏🏻
కామెంట్‌లు