కర్నూలులో కవి సోమన్న "ప్రసన్న వదనం" పుస్తకావిష్కరణ 28న

 నందవరం మండల పరిధిలోని జడ్పీహెచ్ స్కూల్ నాగలదిన్నెలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న బాలబంధు గద్వాల సోమన్న 99వ పుస్తకం "ప్రసన్న వదనం" పుస్తకావిష్కరణ శంకర మఠం, కర్నూలులో 28.06.2026న జరగనుంది.సాహితీ సదస్సు -కర్నూలు వారి ఆధ్వర్యంలో,సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల వారి 112వ జయంతి ఉత్సవాల సందర్బంగా ముఖ్య అతిథులు కళారత్న చంద్రశేఖర్ కల్కూర, జె. యస్. ఆర్. కె. శర్మ,డా. దండెబోయిన పార్వతి,వ్యాఖ్యాత ఆకాశవాణి కండె సునీత మరియు విచ్చేసిన పుర ప్రముఖుల చేతుల మీదగా ఆవిష్కరిస్తారని బహు గ్రంథకర్త గద్వాల సోమన్న ఓ ప్రకటనలో తెలిపారు..
కామెంట్‌లు